AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,854కి చేరింది. ఇక 709 యాక్టివ్ కేసులు ఉండగా.. 1092 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇవాళ 24 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 23 కొత్త […]

ఫ్లాష్ న్యూస్: తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: May 24, 2020 | 8:51 PM

Share

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 41 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,854కి చేరింది. ఇక 709 యాక్టివ్ కేసులు ఉండగా.. 1092 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ 24 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 23 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, రంగారెడ్డిలో 1, వలస కార్మికులు 11, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. మిగిలిన 19 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా తేలింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మిగతా 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది.