AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ సీఎం కేసీఆర్ కీలక సమావేశం.. ప్రధానాంశాలు ఇవే..!

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ రోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగింపు, రాత్రి పూట కర్ఫ్యూ, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు కీలక అంశాలపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. లాక్ డౌన్ ఈ నెల 31తో ముగుస్తుండగా.. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా […]

ఇవాళ సీఎం కేసీఆర్ కీలక సమావేశం.. ప్రధానాంశాలు ఇవే..!
Ravi Kiran
|

Updated on: May 27, 2020 | 6:30 AM

Share

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ రోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగింపు, రాత్రి పూట కర్ఫ్యూ, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు కీలక అంశాలపై ఆయన మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. లాక్ డౌన్ ఈ నెల 31తో ముగుస్తుండగా.. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. అటు ప్రజా రవాణా కూడా ఒక్కొక్కటిగా మొదలుకావడంతో రోడ్లపై వాహనాల రద్దీ కూడా పెరిగింది. పరిమితి సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు సాగుతున్నాయి. సినిమా షూటింగులు కూడా జూన్ నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రధానాంశాలు ఇవే:

  • జీహెచ్ఎంసీ పరిధిలో షాపులను రోజూ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తుండటంతో… దానిపై పూర్తి క్లారిటీ ఇవాళ రానుంది.
  • హోటళ్లు, వస్త్ర దుకాణాలు, మాల్స్, దేవాలయాలపై ప్రభుత్వ వైఖరిని ఖరారు చేయనున్నారు.
  • హైదరాబాద్‌లో సిటీ బస్సులు, మెట్రో రైళ్ల అనుమతి విషయంలో ప్రభుత్వం చర్చించనుంది.
  • పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఇంటర్ ఫలితాల వెల్లడిపైనా చర్చించనున్నారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ప్రభుత్వం స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది.
Follow Us