AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. సీఎం ఇంటి సమీపంలో టీస్టాల్‌ నడిపే వ్యక్తికి పాజిటివ్..!

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అంతా ఇంతా వణికించట్లేదు. చిన్న దేశాలను మొదలు కొని.. అగ్రదేశాలన్నింటిని ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. అంతేకాదు.. ఈ మహమ్మారి ఎవర్నీ కూడా వదలట్లేదు. దీనికి కులం, మతం, భాష, దేశం అంటూ ఏమీ లేవు. అందరూ దీనికి సమానమే. మన ఇండియాలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలను ఈ మహమ్మారి చుట్టేసింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాలు […]

షాకింగ్.. సీఎం ఇంటి సమీపంలో టీస్టాల్‌ నడిపే వ్యక్తికి పాజిటివ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2020 | 9:39 PM

Share

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అంతా ఇంతా వణికించట్లేదు. చిన్న దేశాలను మొదలు కొని.. అగ్రదేశాలన్నింటిని ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. అంతేకాదు.. ఈ మహమ్మారి ఎవర్నీ కూడా వదలట్లేదు. దీనికి కులం, మతం, భాష, దేశం అంటూ ఏమీ లేవు. అందరూ దీనికి సమానమే. మన ఇండియాలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలను ఈ మహమ్మారి చుట్టేసింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా ఎక్కువే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసానికి సమీపంలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడం ఇప్పడు మరింత టెన్షన్ రేపుతోంది. మాతోశ్రీ సమీపంలోని ఓ టీ స్టాల్‌ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అక్కడి ఓ అధికారి తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతమంతా ముందస్తు జాగ్రత్తలో భాగంగా శానిటైజేషన్ చేశారు. అంతే కాదు.. సదరు బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు.

కాగా.. రాష్ట్నంలో సోమవారం మరో 120 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 868కి పెరిగినట్టు వైద్యాధికారులు తెలిపారు.