అంతా కరోనా భయంతో ఉంటే.. మనోడి రూటే సెపరేటు.. కిమ్ జాంగా.. మజాకానా..!
ప్రపంచమంతా కరోనాతో వణికిపోతుంటే… ఆ కరోనానే వణికిస్తాననే రేంజ్లో వ్యవహరిస్తాడు కిమ్ జాంగ్. ప్రస్తుతం ఆయన చేపట్టే చర్యలు ప్రపంచదేశాల్ని వస్మయం చేస్తున్నాయి. దేశంలోకి కరోనా ఎంటరైతే డాక్టర్లను కాల్చేస్తానంటూ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్త్ కోరియా నియంత కిమ్ జాంగ్ ఉన్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఊహించని చర్యలకు దిగారు. రెండు బాలిస్టిక్ క్షిపణులను శుక్రవారం ప్రయోగించారు. ప్రపంచ దేశాలన్నీ కరోనాతో వణికిపోతూ.. మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ కనుగోనేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. […]
ప్రపంచమంతా కరోనాతో వణికిపోతుంటే… ఆ కరోనానే వణికిస్తాననే రేంజ్లో వ్యవహరిస్తాడు కిమ్ జాంగ్. ప్రస్తుతం ఆయన చేపట్టే చర్యలు ప్రపంచదేశాల్ని వస్మయం చేస్తున్నాయి. దేశంలోకి కరోనా ఎంటరైతే డాక్టర్లను కాల్చేస్తానంటూ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్త్ కోరియా నియంత కిమ్ జాంగ్ ఉన్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఊహించని చర్యలకు దిగారు. రెండు బాలిస్టిక్ క్షిపణులను శుక్రవారం ప్రయోగించారు. ప్రపంచ దేశాలన్నీ కరోనాతో వణికిపోతూ.. మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ కనుగోనేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కిమ్ మాత్రం.. మా దేశంలో అసలు కరోనానే లేదన్న సంకేతాలు ఇచ్చేలా.. ఇలా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ విషయాన్నిఅక్కడి అధికారులు తెలిపారు.
చైనా బార్డర్లో ఉండే నార్త్ ప్యోంగ్యాన్ ప్రావీన్స్ భూభాగం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు సౌత్ కోరియాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ క్షిపణులు తమ సరిహద్దు జలాల వద్దే పడ్డాయని అటు జపాన్ అధికారులు కూడా తెలిపారు.
ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు పోరాడుతుంటే.. మరోవైపు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం ఇలా క్షిపణి ప్రయోగాలు చేస్తూ.. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా చేస్తున్నారు.