Nipah Virus: కేరళలో కుదిపేస్తున్న నిఫా వైరస్.. సోకితే ప్రాణాలకే ముప్పు.. అసలు దీని లక్షణాలేంటి..?

కరోనా కల్లోలం నుంచి బయటపడక ముందే కేరళను మరో మహమ్మారి వణికిస్తోంది. ఓ వైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్‌ కేరళను అతలాకుతలం చేస్తోంది.

Nipah Virus: కేరళలో కుదిపేస్తున్న నిఫా వైరస్..  సోకితే ప్రాణాలకే ముప్పు.. అసలు దీని లక్షణాలేంటి..?
Nipah Virus
Follow us

|

Updated on: Sep 07, 2021 | 3:12 PM

Nipah Virus: కరోనా కల్లోలం నుంచి బయటపడక ముందే కేరళను మరో మహమ్మారి వణికిస్తోంది. ఓ వైపు కరోనా, మరోవైపు నిఫా వైరస్‌ కేరళను అతలాకుతలం చేస్తోంది. నిఫా కలకలంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్‌ భీకరంగా వ్యాపిస్తుండగా.. తాజాగా నిపా వైరస్‌ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు వైరస్‌లు గబ్బిలాల నుంచి వచ్చినవే. కానీ.. వీటి లక్షణాలు, రోగి ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కేరళలో చాపకింద నీరులా విస్తరిస్తోంది నిఫా వైరస్. తాజాగా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్‌ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. నిఫాతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడికి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. బాలుడి నమూనాలను సేకరించిన అధికారులు.. ముందే పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కి పంపినట్టు వెల్లడించారు. వాటిని పరిశీలించిన నిపుణులు.. ఆ బాలుడి శరీరంలో నిఫా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. బాలుడితో కాంటాక్ట్‌ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను ప్రారంభించామని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 30 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.

ఎలా మొదలైంది… నిఫా వైరస్‌ కలకలంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖకు సహకారంగా కేంద్రం తరఫున ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పరిశీలన జరుగుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. కేరళలో 2018 జూన్‌లో తొలిసారిగా నిఫా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. మొత్తం 23 కేసులను నిర్ధారించారు. వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నట్లు తెలిపారు అధికారులు. 2019లో ఒకరిలో నిఫా వైరస్‌ మరోసారి నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. తాజాగా నిఫా వైరస్‌తో బాలుడు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కరోనా అలజడితో భయపడుతున్నారు కేరళ ప్రజలు.

వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. నిపా వైరస్‌ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీనిని జునోటిక్‌ వ్యాధి అంటారు. ఇక కరోనా పుట్టుపూర్వోత్తరాలు తేలలేదు. 1999లో తొలిసారిగా మలేషియాలో నిఫా వైరస్‌ను నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత 2001లో బంగ్లాదేశ్‌లో నిఫా కేసులు వెలుగుచూశాయి. ఒకరి నుంచి ఒకరిని తాకడం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. 14 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తలతిరగడం, వాంతులు, జ్వరం ఈ వైరస్‌ లక్షణాలని చెబుతున్నారు. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్‌ ఉంటుంది. 2018లో కేరళలో వచ్చిన కేసులు పెరంబ్ర తాలుకా ఆసుపత్రి, కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలోనే నమోదయ్యాయి. తొలి రోగికి ఇక్కడే చికిత్స చేశారు. వైరస్ తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లోనే బాధితులు మృతి చెందే ప్రమాదముంది. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్‌ వెరీ డేంజరస్‌ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పటివరకు ట్రీట్‌మెంట్‌ లేని ఈ ప్రాణాంతక వైరస్​ నుంచి ప్రజలను రక్షించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది. నిపా వైరస్‌ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్‌ బ్యాట్‌ అనే గబ్బిలాలు,కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్‌ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు.

వ్యాధి చికిత్స ఎలా ఉంటుంది.. నిపా వైరస్‌కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. రోగిని వేరుగా ఉంచుతున్నారు. తగినంత నీరు అందిస్తున్నారు. దీంతోపాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ చికిత్స విధానం వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. నిపాపై వాడేందుకు పలు యాంటీవైరల్‌ డ్రగ్స్‌ను సీఈపీఐ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కానీ, అవి జంతువుల్లో మాత్రమే మంచి ఫలితాలను చూపించాయి. కోవిడ్‌తో పోలిస్తే నిపా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైంది. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గ్లోబల్‌ వైరస్‌ నెట్‌వర్క్‌ ప్రకారం నిపా వైరస్‌ ఆర్‌నాట్‌ 0.43. అంటే 100 మంది నిపా వైరస్‌ బాధితుల నుంచి కేవలం మరో 43 మందికే వ్యాధి వ్యాపిస్తుందన్నమాట. కానీ, వ్యాధి సోకిన వారిలో 45శాతం నుంచి 70శాతం మంది మరణిస్తున్నారు. కేరళలో 19 మందికి వైరస్‌ సోకితే 17 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఆర్‌నాట్‌ తరచూ 1కిపై గా నమోదవుతోంది. అంటే నిపాతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపిస్తోందన్నమాట. చాలా మంది స్వల్ప లక్షణాలతో బయటపడుతున్నారు. మరణాల రేటు కూడా 1శాతం కంటే తక్కువగా ఉంటోంది.

ఏయే దేశాల్లో వైరస్ వ్యాపించింది.. 1999లో వెలుగులోకి వచ్చిన నిపా వైరస్‌కు ఇప్పటి వరకు ఎటువంటి ఔషధం లేదు. అంతేకాదు టీకాను తయారు చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకా తయారీ ప్రాధ్యాన్యాల బ్లూప్రింట్‌లో నిపా వైరస్‌ కూడా ఉంది. నిపా వ్యాప్తి కేవలం స్థానికంగా పరిమితం కావడంతో దీని టీకాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. నిపా వైరస్‌ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనుగొన్నారు. ఇప్పటికే మలేసియా, భారత్‌, సింగపూర్‌, బంగ్లాదేశ్‌ల్లో మనుషులకు సోకింది. అదే సమయంలో కాంబోడియా, ఇండోనేసియా, మడగాస్కర్‌, థాయ్‌లాండ్‌, తిమోర్‌ వంటి దేశాల్లోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ జాడ బయటపడింది. భారత్‌లోని సిలుగురిలో 2001 జనవరి-ఫిబ్రవరి మధ్య 66 నిపా కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన ప్రతి నలుగురిలో ముగ్గురు మరణించారు.

నిఫా వైరస్‌ను ఎలా గుర్తించడం.. నిపా వైరస్‌ను గుర్తించడానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్‌ ఛైన్‌ రీయాక్షన్‌ పరీక్షలో కూడా కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్‌ పరీక్షకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా కోజికోడ్‌లో నిపా వ్యాపించడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. తీవ్రమైన ఆంక్షలను విధించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులను నియమించారు. నిపా వైరస్‌ విషయంలో కూడా కరోనా వలే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వంటి చర్యలు తీసుకొంటారు. 2018లో కేరళ ప్రభుత్వం సమర్థంగా నిపా వైరస్‌ను అరికట్టిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందించింది. ఆరోగ్య వ్యవస్థ సమన్వయంతో పనిచేసి.. వేగంగా స్పందించడం వంటి చర్యలతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొంది.

Read Also…  

Vinayaka Chavithi: చ‌వితినాటి విగ్రహం, పత్రి , పిండివంటల సంప్రదాయంలో దాగిన విజ్ఞానం, సైన్స్ మీకు తెలుసా..

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..