దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
హర్యానాలో దారుణం: తనకంటే అందంగా ఉన్నారనే అసూయతో ఓ మహిళ ముగ్గురు బాలికలను, కన్న కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసింది. పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా సాగిన ఈ ఘాతుకం ఇటీవల వెలుగులోకి వచ్చింది. నిందితురాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈర్ష్య ఎంతటి దారుణాలకు దారితీస్తుందో ఈ ఘటన తెలియజేస్తుంది.
ఇతరులపట్ల ఈర్ష్య అసూయలు ఉండకూడదని పెద్దలు చెబుతారు. ఈర్ష్య అనేది ఎంతటి దారుణాలకు ఉసిగొల్పుతుందో ఈ ఘటన తెలిజేస్తుంది. హర్యానాలో తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. అంతేకాదు, తాను చేసిన హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కన్న కొడుకును సైతం బలితీసుకుంది. ఈ దారుణ ఘటన హర్యానాలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతుండగా, ఇటీవల జరిగిన ఓ చిన్నారి మృతితో అసలు నిజం బయటపడింది. నిందితురాలైన 32 ఏళ్ల పూనమ్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం నౌల్తా గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆరేళ్ల విధి అనే బాలిక అదృశ్యమైంది. కాసేపటి తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని ఓ గదిలో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్బులో శవమై కనిపించింది. కేవలం అడుగు లోతున్న టబ్బులో చిన్నారి మునిగి చనిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం 36 గంటల్లోనే కేసును ఛేదించి, బాలిక పిన్ని అయిన పూనమ్ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె తన నేరాలన్నింటినీ అంగీకరించింది. అందమైన ఆడపిల్లలను చూస్తే తనకు ద్వేషం, అసూయ కలిగేవని నిందితురాలు పోలీసులకు చెప్పింది. వారు పెరిగి పెద్దయ్యాక తనకంటే అందంగా ఉంటారనే అక్కసుతోనే హత్యలు చేసినట్లు తెలిపింది. 2023లో సోనిపట్లోని తన అత్తగారి ఇంట్లో తొమ్మిదేళ్ల ఆడపడుచు కూతురిని నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, ఆ తర్వాత మూడు నెలలకే తన మూడేళ్ల కుమారుడు శుభంను కూడా ఇదే పద్ధతిలో హత్య చేసింది. ఈ ఏడాది ఆగస్టులో పానిపట్లోని తన పుట్టింట్లో బంధువుల అమ్మాయిని కూడా ఇలాగే చంపేసింది. ప్రతి హత్యను ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ప్రమాదాలుగానే భావించి అంత్యక్రియలు పూర్తిచేశారు. నిందితురాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పాత కేసుల ఫైళ్లను తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

