మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
ప్రకాశం జిల్లాలో యూట్యూబ్ చూసి బైకులు దొంగిలించిన అన్నదమ్ములు పట్టుబడ్డారు. జల్సాలకు అలవాటుపడి పిన్నీసుతో బైక్లు స్టార్ట్ చేయడం యూట్యూబ్లో నేర్చుకున్నారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో వీరిని అరెస్ట్ చేసి, 10 లక్షల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి ఇది తాజా ఉదాహరణ.
సోషల్ మీడియాలో దొరకని కంటెంట్ ఉండదు. ఒక్క క్లిక్తో ఎవరికి కావలసిన కంటెంట్ వారికి దొరుకుతుంది. విద్యార్ధులనుంచి దొంగల వరకూ అందరికీ ఏకైక గురువు సోషల్ మీడియా. ఎందుకంటే.. ఓ దొంగ యూట్యూబ్లో చూసి ఈజీగా బైకులు కొట్టేయడం ఎలా అనేది నేర్చుకున్నాడు. తన తమ్ముడితో కలిసి ఎంతో ఈజీగా బైకులు కొట్టేస్తూ.. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో చోటు చేసుకుంది. నవంబర్ 29వ తేది సాయంత్రం 6 గంటల సమయములో ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పాతచెరువు తండాకు చెందిన ఓ వ్యక్తి తన బైక్ను ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పార్క్చేసి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. అదేరోజు రాత్రి తన బైక్ కనిపించడం లేదని పుల్లలచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఎక్కువగా బైక్లు చోరీకి గురవుతుండటంతో తాజాగా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం డిఎస్పి నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడి బైక్లను చోరీ చేస్తున్న ముఠాలపై నిఘా పెట్టారు. పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్, సిబ్బంది నేరం జరిగిన తీరును విశ్లేషిస్తూ, కేసును నిరంతరం రివ్యూ చేశారు. నేరం జరిగిన స్థలంలో సిసి కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ముద్దాయిల సమాచారాన్ని సేకరించి బుధవారం పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామ శివార్లలో ఇద్దరు నిందితులు వేణు, సన్నీలను అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి 10 లక్షల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేశ్పాలెం గ్రామానికి చెందిన వేణు, సన్నీ అనే అన్నదమ్ములు జల్సాలకు అలవాటు పడ్డారు. విలాసాలకు తగినంత సంపాదన లేకపోవటంతో హ్యాండ్ లాక్ వేయని బైక్లను చోరీ చేసి అమ్ముకోవాలని పథకం వేశారు. అందుకు యూట్యూబ్లో పిన్నీసుతో బైక్లను ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నారు.. ఆ తరువాత తమ చేతివాటం ప్రదర్శించి కేవలం పిన్నీసుతో 11 బైక్లను చోరీ చేశారు. ఇలా పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దొనకొండ, మార్కాపురం రూరల్, పాత గుంటూరు , పిడుగురాళ్ల, కారంపూడి, నాగార్జునసాగర్, తెలంగాణ, హాలియా బస్టాండ్ దగ్గర బైక్లను చోరీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని మార్కాపురం డిఎస్పి నాగరాజు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
Akhanda 2: అఖండ 2 ముందున్న అతిపెద్ద సవాల్ అదే
సంక్రాంతికి నేనూ ఉన్నాను అంటున్న సిక్స్ ప్యాక్ హీరో
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
11 ఏళ్ల చిన్నారి చిరుతతో పోరాటం.. అదే అతనికి రక్షణ కవచమైంది
ఈ స్వామికి పానకం అంటే ఎంతిష్టమో.. నెలకు 50 వేల లీటర్ల
24 గంటలకు కాదు.. అక్కడ 64 రోజులకు సూర్యోదయం
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
ఏలియన్స్కు టెంపుల్ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు

