AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 again : నాగోల్ బాలికల హాస్టళ్లో 38 మందికి, కామారెడ్డి జిల్లా స్కూళ్లో 31 మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్

Covid-19 again : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గిందనుకున్న తరుణంలో తెలంగాణలో..

Covid-19 again : నాగోల్ బాలికల హాస్టళ్లో 38 మందికి,  కామారెడ్డి జిల్లా స్కూళ్లో 31 మంది విద్యార్థులకి  కరోనా పాజిటివ్
Venkata Narayana
|

Updated on: Mar 16, 2021 | 8:08 PM

Share

Covid-19 again : తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. వ్యాక్సిన్‌ వచ్చి కరోనా తీవ్రత తగ్గిందనుకున్న తరుణంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండం అందర్నీ కలవరపరుస్తోంది. తాజాగా రెండు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పెద్ద ఎత్తున కరనా బారిన పడ్డం  అందర్నీ  కలవరపాటుకు గురిచేస్తోంది.  నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్  బాలికల స్కూల్ లో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం విద్యార్థుల తల్లిదండ్రుల్ని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ కేజీబీవీ పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ రావడం ప్రమాద ఘంటికలకు సూచీగా మారింది. దీంతో పాఠశాలల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రభుత్వం మంతనాలు మొదలుపెట్టింది.

Read also : L Ramana : అమరావతిని ఎంపిక చేసిన తరువాతే అసైన్డ్ భూములు తీసుకున్నారు : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు