AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Maharashtra COVID-19 cases: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అన్నిచోట్లా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సైతం అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ సైతం

Coronavirus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
ప్రతీకాత్మక చిత్రం
Shaik Madar Saheb
|

Updated on: Mar 29, 2021 | 11:25 PM

Share

Maharashtra COVID-19 cases: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అన్నిచోట్లా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సైతం అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ సైతం విధిస్తున్నప్పటికీ.. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 31,643 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 102 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 54,283 కి పెరిగింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 20,854 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 23,53,307 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,36,584 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా నిబంధనలు పాటించకపోతే.. కఠినమైన లాక్డౌన్‌ను అమలు చేయక తప్పదని హెచ్చరించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో దాదాపు 84 శాతం ఎనిమిది రాష్ట్రాలకు చెందినవేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 నాలుగు గంటల్లో నమోదైన 68 వేల కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 40 వేలకు కేసులు వెలుగులోకి వచ్చాయని వెల్లడించింది. దీంతోపాటు కర్ణాటకలో 3,082 కేసులు, పంజాబ్‌లో 2,870 కేసులు, మధ్యప్రదేశ్‌లో 2,276 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతోపాటు గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని.. ఈ ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య బాగా పెరుగుతోందని తెలిపింది.

Also Read:

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు