కూకట్పల్లి సీఐకి హిమాచల్ప్రదేశ్ సీఎం ప్రశంస
కూకట్పల్లి సీఐ లక్ష్మినారాయణరెడ్డిని హిమాచల్ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్రశంసించారు.
కూకట్పల్లి సీఐ లక్ష్మినారాయణరెడ్డిని హిమాచల్ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన లలిత్ కుమార్ అనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరు ముందుకు రాలేదు. పైగా అతని వద్ద వైద్యానికి డబ్బు కూడా లేదు. దీంతో విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి అత్యవసర వైద్యానికి రూ.20 వేలు కావాల్సి ఉండగా, కూకట్పల్లి సీఐ లక్ష్మినారాయణరెడ్డి ఆ డబ్బును చెల్లించారు. ఈ విషయం తెలుసుకున్న హిమాచల్ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కూకట్పల్లి సీఐని ప్రశంసించారు. ఆపదలో అండగా నిలిచే మీ వ్యక్తిత్వం పలువురికి ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.