AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్కజ్‌కు వెళ్లిన ఆ తబ్లీఘీలను పోలీసులకు అప్పగించాల్సిందే..!

గత మార్చి నెలలో దేశరాజధాని ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవనంలో జరిగిన తబ్లీఘీ సమావేశాల గురించి తెలిసిందే. ఈ సమావేశాలకి అనుమతి లేకుండానే పెద్ద ఎత్తున విదేశీయులు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పలువురికి కరోనా పాజిటివ్ ఉండటం.. ఆ తర్వాత వారి ద్వారా సమావేశాలకు హాజరైన తబ్లీఘీ సభ్యులకు కూడా సోకడంతో.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణమైంది ఈ మర్కజ్ సమావేశం. అయితే ఈ సమావేశాలకు విజిటింగ్ వీసాలతో […]

మర్కజ్‌కు వెళ్లిన ఆ తబ్లీఘీలను పోలీసులకు అప్పగించాల్సిందే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 10, 2020 | 4:41 PM

Share

గత మార్చి నెలలో దేశరాజధాని ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవనంలో జరిగిన తబ్లీఘీ సమావేశాల గురించి తెలిసిందే. ఈ సమావేశాలకి అనుమతి లేకుండానే పెద్ద ఎత్తున విదేశీయులు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పలువురికి కరోనా పాజిటివ్ ఉండటం.. ఆ తర్వాత వారి ద్వారా సమావేశాలకు హాజరైన తబ్లీఘీ సభ్యులకు కూడా సోకడంతో.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణమైంది ఈ మర్కజ్ సమావేశం. అయితే ఈ సమావేశాలకు విజిటింగ్ వీసాలతో హాజరై.. మతపరమైన సమావేశాల్లో పాల్గొని.. వీసా రూల్స్ అతిక్రమించడంతో… దాదాపు పదకొండు వందల విదేశీయులపై కేసులు నమోదు చేసింది. అయితే వీరిలో అనేక మంది క్వారంటైన్‌లో ఉండగా.. మరికొందరు కరోనా పాజిటివ్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో చాలా మంది కరోనా నుంచి కోలుకుని ఇంకా కూడా క్వారంటైన్‌లో ఉంటుండటంతో.. ఢిల్లీ పోలీస్ అధికారులు స్పందించారు. వెంటనే కరోనా నెగిటివ్ వచ్చిన విదేశీ తబ్లీఘీలను పోలీసులకు అప్పగించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న 567 మంది విదేశీయులకు కరోనా పరీక్షల అనంతరం నెగిటివ్ వస్తే వారిని పోలీసులకు అప్పగించాలని ఢిల్లీ అధికారులు ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే తబ్లిగ్‌ చీఫ్‌పై కూడా ఢిల్లీ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఇదే మర్కజ్ సమావేశానికి హాజరైన 2446 మంది మన దేశానికి చెందిన సభ్యులు కూడా ఢిల్లీలోని క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారని అధికారులు తెలిపారు. వారందరికీ నెగిటివ్‌ వస్తే వాళ్లను ఇళ్లకు పంపాలని సూచించారు. వారంతా ఇళ్లకు వెళ్లేందుకు పాస్‌లు కూడా జారీ చేయాలని.. నేరుగా ఇంటికి వెళ్లేలా చూడాలని అదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పారు.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!