AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రక్కసికి మరొకరు బలి.. పిఠాపురంలో తొలి కోవిడ్ మరణం..

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తొలి కరోనా వైరస్ మరణం సంభవించింది. గుట్ల వీధికి చెందిన 68 ఏళ్ల వ్యక్తికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాకినాడ మాదవపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి...

కరోనా రక్కసికి మరొకరు బలి.. పిఠాపురంలో తొలి కోవిడ్ మరణం..
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jun 29, 2020 | 2:57 PM

Share

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తొలి కరోనా వైరస్ మరణం సంభవించింది. గుట్ల వీధికి చెందిన 68 ఏళ్ల వ్యక్తికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాకినాడ మాదవపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి గుండె సంబంధిత వ్యాధితో చికిత్స నిమిత్తం వెళ్లగా.. ఆయనకి కరోనా లక్షణాలు కూడా ఉండటంతో డాక్టర్లు కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. అనంతరం రిపోర్ట్స్‌లో కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో వైద్యులు వెంటనే ఆయన చికిత్స అందించారు. అయితే ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధి కూడా ఉండటంతో  చికిత్స పొందుతూ ఈ రోజు ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా అటు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 706 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 87 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇందులో 7,479 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,232 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 180కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 706 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ఆదివారం 302 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 11 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 96, చిత్తూరు 56, ఈస్ట్ గోదావరి 72, గుంటూరు 98, కడప 71, కృష్ణ 52, కర్నూలు  86, నెల్లూరు 24, ప్రకాశం 26, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 11, విజయనగరం 1, వెస్ట్ గోదావరిలో 113 కేసులు నమోదయ్యాయి.

Read More: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..