Covid Vaccine: నియంత్రణలోకి వస్తున్న కరోనా.. వ్యాక్సినేషన్‌తో సత్ఫలితాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు..!

గత కొన్ని రోజులుగా వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రికార్డుస్థాయిలో నమోదైన పాజిటివ్ కేసులు.. దిగివస్తున్నాయి. జూన్‌ నాటికి కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Covid Vaccine: నియంత్రణలోకి వస్తున్న కరోనా.. వ్యాక్సినేషన్‌తో సత్ఫలితాలు.. తగ్గుతున్న పాజిటివ్ కేసులు..!
Corona Vaccine
Follow us

|

Updated on: May 24, 2021 | 2:25 PM

Covid-19 Vaccine Tracker: గత కొన్ని రోజులుగా వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రికార్డుస్థాయిలో నమోదైన పాజిటివ్ కేసులు.. దిగివస్తున్నాయి. జూన్‌ నాటికి కరోనా కంట్రోల్‌లోకి వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలకు తోడు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ తోడవుతుండటంతో కరోనా నియంత్రణలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. మరి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? ఇలాంటి సమాచారంపై ఓ లుక్కెద్దాం.. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. ఇదే ఇప్పుడు టీవీ9 నినాదం.. దేశం విధానం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 కోట్ల 24లక్షల 58 వేల 538 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 15 కోట్ల 7 లక్షల 16 వేల 560 మందికి మొదటి డోస్ అందగా.. 4 కోట్ల 17 లక్షల 41 వేల 978 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 4 లక్షల 17 వేల 978 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందికి వ్యాక్సిన్ అందిందనే విషయాలను గమనిస్తే.. ఏపీలో ఇప్పటి వరకు 79 లక్షల 42 వేల 491 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 55 లక్షల 87 వేల 232 మందికి మొదటి డోస్ తీసుకోగా.. 23 లక్షల 55 వేల 228 మందికి రెండో డోస్ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 55 లక్షల 28 వేల 415 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్ పూర్తైన వారు 44 లక్షల 53 వేల 980 మంది. రెండో డోస్ పూర్తైన వారు 10 లక్షల 74 వేల 432 మంది. తెలంగాణలో ఈరోజు కేవలం 2వేల మందికే వ్యాక్సినేషన్‌ జరిగింది. 45ఏళ్లు పైబడినవారికే తప్ప.. తొలి డోసుకు ఇంకా అనుమతి రాలేదు. ఇక పెయిడ్‌ వ్యాక్సినేషన్లు ఎక్కువ జరుగుతున్నట్లు తెలుతోంది.

ఇక, ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలు చూస్తే.. 23 కోట్ల 28 లక్షల 85 వేల 166 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 8 కోట్ల 96 లక్షల 289 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 14 కోట్ల 32 లక్షల 84 వేల 877 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి వ్యాక్సిన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? లేదంటే.. ఇప్పుడు కోవిన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.

Covid Vaccine

Covid VaccineRead Also…..  Covid 19 Vaccine: వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన రాష్ట్రాలకు షాక్..? ఫైజర్, మెడెర్నా కీలక నిర్ణయం

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..