AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron XE: భారత్‌లో ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కలకలం.. గుజరాత్‌లో తొలి కేసు.. ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న సమయంలో మరో బాంబు పేలింది. తాజాగా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ కలకలం సృష్టిస్తోంది.

Omicron XE: భారత్‌లో ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కలకలం.. గుజరాత్‌లో తొలి కేసు.. ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు!
Covid 19 Omicron Xe Variant
Balaraju Goud
|

Updated on: Apr 09, 2022 | 10:59 AM

Share

Covid 19 Omicron XE variant: దేశవ్యాప్తంగా కరోనా(Coronavirus) మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న సమయంలో మరో బాంబు పేలింది. తాజాగా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంబయిలో కొత్త రకం కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్ కేసు బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌(Gujarat)లోనూ తొలి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ కేసు వెలుగు చూసినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక వర్గాల సమాచారం. అయితే అది కచ్చితంగా ఎక్స్‌ఈ వేరియంటేనా కాదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు.

కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ బ్రిటన్‌లో తొలి కేసు నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 600 కేసులునమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కరోనా వైరస్‌కు కొత్త రూపాంతరం కనిపించడం ఆందోళన కలిగించే విషయం. అదే సమయంలో కోవిడ్ 19 గురించి ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది . కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకారం, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. అలాగే, కొత్త కరోనా కేసుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో కరోనా వైరస్ XE వేరియంట్ బాధితుడు గుర్తించినట్లు, ఇది రాష్ట్రంలో మొదటి కేసు అని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కంటే తీవ్రమైనది కాదని, అయినప్పటికీ ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. ఇటీవల, ముంబైలో XE వేరియంట్ నుండి ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. ఎక్స్‌ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తోన్న వ్యక్తి నమూనాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)కు పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం పేర్కొనలేదు. సదరు వ్యక్తి మార్చి 13న కొవిడ్‌ బారిన పడగా.. వారానికి కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఎక్స్‌ఈ వేరియంట్‌ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో తదుపరి విశ్లేషణ నిమిత్తం ఎన్‌సీడీసీకి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

కోవిడ్ 19కి సంబంధించి ఐదు రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అలాగే కొత్త కరోనా కేసుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో పెరుగుతున్న కరోనా కేసులపై గట్టి నిఘా ఉంచాలని ఆయన సూచించారు. ఈ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, అందువల్ల కొత్త కరోనా కేసుల పెరుగుదలను ఖచ్చితంగా పర్యవేక్షించాలని, అవసరమైతే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్ -19 కి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆరోగ్య కార్యదర్శి అన్నారు.

అదే సమయంలో, దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య నిరంతరం తగ్గుతుండగా, కేరళతో సహా ఐదు రాష్ట్రాలు గత ఏడు రోజుల్లో పాజిటివిటీ రేటులో అకస్మాత్తుగా పెరుగుదలను నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, మిజోరం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తతను పెంచాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం, సంక్రమణ రేటు పెరుగుదలకు గల కారణాలను తీవ్రంగా పరిశోధనలు జరగాలని తెలిపింది..

కాగా, ఒమిక్రాన్‌లోని రెండు సబ్‌ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్‌ఈ వేరియంట్‌గా రూపాంతరం చెందాయి. తొలిసారిగా యూకేలో బయటపడిన ఈ వేరియంట్‌.. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్‌ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని సమాచారం.

ఇదిలావుంటే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో కేరళలో 353, మహారాష్ట్రలో 113, హర్యానాలో 336 మరియు మిజోరంలో 123 కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో, దేశవ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తే, గత 24 గంటల్లో, 1,109 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, మహమ్మారి ధాటికి నిన్న ఒక్కరోజే 43 మంది మరణించారు. అయితే, గురువారం దేశవ్యాప్తంగా 1,033 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, కరోనా యొక్క కొత్త వైవిధ్యాల ముప్పు మధ్య, 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 10 నుండి మూడవ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనికి ముందు జాగ్రత్త మోతాదు అని పేరు పెట్టింది. ఇది ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా విధించడం జరగుతుంది. అయితే, ప్రైవేట్ టీకా కేంద్రాలలో అందించే టీకాలకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఈ మోతాదు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, 9 నెలలు లేదా అంతకంటే ముందు రెండవ మోతాదు పొందిన వారికి మాత్రమే వర్తింపజేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.

Read Also… సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత .. విషాదంలో టాలీవుడ్