ఫ్లాష్న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో 1897 ఎపిడమిక్ యాక్ట్.. అతిక్రమిస్తే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో జన సంచారంపై ప్రభుత్వాలు సీరియస్ అయ్యాయి.'జనతా కర్ఫ్యూ' అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు మార్చి 31వ తేదీ వరకూ లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా రోడ్లపై విపరీతంగా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో జన సంచారంపై ప్రభుత్వాలు సీరియస్ అయ్యాయి.’జనతా కర్ఫ్యూ’ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు మార్చి 31వ తేదీ వరకూ లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా రోడ్లపై విపరీతంగా జనం తిరుగుతుండటంపై సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం తర్వాత నుంచి రోడ్లపై సరైన కారణం లేకుండా కనిపిస్తే.. భారీ ఫైన్లు వేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 1897 ఎపిడమిక్ యాక్ట్ అతిక్రమిస్తే కేసులు తప్పవంటూ సూచనలు జారీ చేశారు ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఇతరులకు ఇబ్బందులు కలిగించినా, అనవసరంగా ఇళ్లు దాటి బయటకు వచ్చినా చర్యలు తప్పవని పేర్కొన్నాయి ప్రభుత్వాలు.
Read more also: మీరు సూపరంటూ కేసీఆర్ని పొగిడేసిన అమిత్ షా
కరోనాను జయించాలంటే.. ఈ డైట్ని మెయిన్టైన్ చేయాల్సిందే
కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం
నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?
బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్