AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై పోరాటం: సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం.. టీటీడీ మాటేంటి..!

కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు పలువురు. సినీ, క్రీడా, రాజకీయ తేడా లేకుండా పలు రంగాల్లోని సెలబ్రిటీలు తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు.

కరోనాపై పోరాటం: సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం.. టీటీడీ మాటేంటి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 10:03 PM

Share

కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు పలువురు. సినీ, క్రీడా, రాజకీయ తేడా లేకుండా పలు రంగాల్లోని సెలబ్రిటీలు తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం ప్రకటించింది. తమ సంస్థ తరఫున రూ.51కోట్ల రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నట్లు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది.

కాగా ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు టీటీడీ(తిరుమల తిరుమల దేవస్థానం) సాధారణంగా విరాళాలు ఇస్తూ వస్తుంటుంది. మరి వందల కోట్ల ఆదాయాన్ని ఘడించే ఈ బోర్డు.. కరోనాపై యుద్ధానికి ఎన్ని కోట్లు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ విరాళంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే భారీ ప్రకటన చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.. కాగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 840కు పైగా చేరగా.. 17మంది ఈ వైరస్ తో మరణించారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..!