విషాదం.. కుప్పకూలిన హోటల్.. శిథిలాల కింద 70 మందికి పైగా కరోనా బాధితులు..!

చైనాలోని క్వాంఝౌలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరోనా అనుమానితులను చికిత్స అందించి కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. చైనాకు మరో షాకింగ్ తగిలింది. కరోనా అనుమానితులకు ఎనభై గదుల్లో చికత్స అందిస్తున్న ఓ రెండంతుస్తుల హోటల్ శనివారం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద దాదాపు 70 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. కరోనా అనుమానితులు కావడంతో.. రెస్క్యూ టీం పలు జాగ్రత్తలు చేపడుతోంది. ఏకంగా వీరిని కాపాడేందుకు..147 […]

విషాదం.. కుప్పకూలిన హోటల్.. శిథిలాల కింద 70 మందికి పైగా కరోనా బాధితులు..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 6:58 AM

చైనాలోని క్వాంఝౌలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కరోనా అనుమానితులను చికిత్స అందించి కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. చైనాకు మరో షాకింగ్ తగిలింది. కరోనా అనుమానితులకు ఎనభై గదుల్లో చికత్స అందిస్తున్న ఓ రెండంతుస్తుల హోటల్ శనివారం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద దాదాపు 70 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. కరోనా అనుమానితులు కావడంతో.. రెస్క్యూ టీం పలు జాగ్రత్తలు చేపడుతోంది. ఏకంగా వీరిని కాపాడేందుకు..147 మంది రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి.. 34 మందిని సురక్షితంగా రక్షించారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాంఝౌ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles