AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

Coronavirus Lockdown: మద్యం అమ్మకాలకు అనువతివ్వందంటూ భారత ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల సమాఖ్య(సీఐఏబీసీ) తెలంగాణతో సహా 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసింది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దాని వల్ల ఖజానాపై అధికభారం పడుతోందని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సీఎంలకు సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి లేఖ రాశారు. రాష్ట్రాల్లో అక్రమ […]

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..
Ravi Kiran
|

Updated on: Apr 09, 2020 | 2:12 PM

Share

Coronavirus Lockdown: మద్యం అమ్మకాలకు అనువతివ్వందంటూ భారత ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీల సమాఖ్య(సీఐఏబీసీ) తెలంగాణతో సహా 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసింది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. దాని వల్ల ఖజానాపై అధికభారం పడుతోందని తెలిపింది.

ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సీఎంలకు సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి లేఖ రాశారు. రాష్ట్రాల్లో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని.. దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో శాంతి భద్రతలపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కాగా, దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల సామాన్యులతో పాటు మందుబాబులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొంతమంది మద్యానికి బానిసైన వారు వివిధ రసాయనాలు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు పిచ్చి పట్టి పిచ్చాసుపత్రుల్లో చేరుతున్నారు. ఇక మందుబాబుల మరణాలు ఎక్కువగా కేరళ, తెలంగాణ, కర్ణాటకలలో జరుగుతుండటం గమనార్హం.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…