AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

కరోనా వ్యాపిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఏపీని లాక్‌డౌన్ చేశారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు..

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2020 | 6:03 PM

Share

కరోనా వ్యాపిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఏపీని లాక్‌డౌన్ చేశారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీధులన్నింటిలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ విధంగానే గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మాచర్ల పట్టణంలోని పురవీధుల్లో క్లోరిన్ మందు స్ప్రే చేశారు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా క్లోరిన్ మందు స్ప్రే చేసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా.. ఏపీలో ఇప్పటికే 13 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో 4, విజయవాడలో 3, గుంటూరులో 2, నెల్లూరులో 1, ఒంగోలులో 1, రాజమండ్రిలో 1, తిరుపతిలో 1 చొప్పున మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో 60కి పైగా చేరాయి. దీంతో మరింతగా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు ఇరు రాష్ట్రాల చర్యలు సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి: పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్