కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య
కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతో వృద్ధుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కొత్త పల్లిలో చేటుచేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. అక్కల సంజీవయ్య (44) అనే వృద్ధుడు చెట్టుకు..
కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతో వృద్ధుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కొత్త పల్లిలో చేటుచేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. అక్కల సంజీవయ్య (44) అనే వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చాడు వెంకయ్య. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.. ‘కొడుకుకు ఫోన్ చేసి తనకు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానంగా ఉంది. నా వల్ల ఊరంతా వైరస్ వస్తుంది. నేను పోతే దూరంగా ఉండి చూడండి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి: రైతులకు ఊరట.. లాక్డౌన్ వర్తించదు..
తిండి లేక గడ్డి తింటోన్న చిన్నారులు..
జబర్దస్త్లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన