జబర్దస్త్లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు
కరోనాతో ఇంటికే పరిమితమవడంతో.. అటు షూటింగులు, ఇటు ఈవెంట్లు లేక విలవిల్లాడుతున్నామని అంటున్నారు. సుధీర్, హైపర్ ఆది, శ్రీను, శశి, అభి, అనసూయ, రష్మీ లాంటి..
కరోనా వైరస్తో దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. దీన్ని అరికట్టాలంటే.. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి. దీంతో స్కూళ్లు, కాలేజీలు, థియేటర్స్, మాల్స్ అన్నింటినీ బంద్ చేశారు. ఇక టాలీవుడ్ నటులు కూడా స్వచ్ఛందంగా షూటింగ్స్ని ఆపివేశారు. అలాగే టీవీకి కూడా కరోనా ఎఫెక్ట్తో సీరియల్స్, ఎంటర్ టైన్మెంట్ షోస్ అన్నీ ఆగిపోయాయి. వీటన్నింటిలో ముఖ్యంగా తెలుగు టీవీ పరిశ్రమకు కరోనా.. కష్టకాలం తెచ్చింది. అందుకు జబర్దస్త్ కామెడీ షో మినహాయింపు కాదు. ఈ షోతో చాలా మంది స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక వైపు షూటింగులు, మరోవైపు ఈవెంట్లతో బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు కరోనా లాక్డౌన్తో షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. జబర్దస్త్ షూటింగ్స్ కూడా నిలిపివేశారు.
దీంతో కమెడియన్లందరూ ఇళ్లకే పరమితమయ్యారు. ఇంకా ఎంత కాలమని ఆర్టిస్టులంతా వాపోతున్నారు. జబర్దస్త్ అంటే మాకు పండగని.. హాయిగా నవ్వుతూ.. కష్టమైనా కూడా పని చేస్తూంటామన్నారు. ఇప్పుడు కరోనాతో ఇంటికే పరిమితమవడంతో.. అటు షూటింగులు, ఇటు ఈవెంట్లు లేక విలవిల్లాడుతున్నామని అంటున్నారు. సుధీర్, హైపర్ ఆది, శ్రీను, శశి, అభి, అనసూయ, రష్మీ లాంటి వాళ్లకు ఇబ్బందులు లేకపోయినా మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఈ లాక్డౌన్ పెద్ద దెబ్బే అనే చెప్పాలి.
ఎందుకంటే.. ఎపిసోడ్స్ చొప్పున పేమెంట్స్ తీసుకునే వీరంతా షూటింగులు లేకపోవడంతో తమ భవిష్యత్ ఎలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగులు లేని కారణంగా తమ యాజమాన్యమే పట్టించుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘కరోనా వైరస్’ అంటూ జర్నలిస్ట్కి వేధింపులు.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!
తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..
ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు
జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్ఐ చెల్లింపులు పొడిగించాలని..
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన