AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు..

కరోనా ఎఫెక్ట్: ఏపీలో 58 వేల వాహనాలు సీజ్.. 17 వేల మంది అరెస్ట్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 05, 2020 | 2:41 PM

Share

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మార్చి 22 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ అమలులో ఉంది. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప.. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని మొదటి రోజు నుంచీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ కోరుతూ వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే హెచ్చరించారు. అయినా లెక్క చేయకుండా అకారణంగా రోడ్లపైకి వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు.

ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు నమోదయినట్లు తెలిపారు. కాగా ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఆ మచ్చ జీవితాంతం అలాగే ఉంటుందని పేర్కొన్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు.. మీపై ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయా? అని చెక్ చేస్తారు అధికారులు. దీంతో ప్రజలందరూ ఇది గమనించి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ నిబంధనలు పాటించని 58 వేల వాహనాల్ని సీజ్ చేశారు పోలీసులు. అవన్నీ వివిధ జిల్లాలో నమోదయ్యాయి. అలాగే 17 వేల మందిని అరెస్ట్ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాహనాలకు రూ.43 కోట్లు ఫైన్ వేశారు. ఇక ఏపీలో అత్యంత బిజీ సిటీ అయిన విజయవాడలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎక్కువ అరెస్టులు జరిగ్గా.. వెహికిల్స్‌కి ఎక్కువ ఫైన్.. అనంతపురం జిల్లాలో వేశారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!