దేశీయ ప్రయాణాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ..
లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, పలు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. ఇక రేపటి నుంచి దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానుండగా.. డొమెస్టిక్ ట్రావెల్స్ విషయంలో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రయాణీకుల అందరి దగ్గర ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా ఉండాలి. కోవిడ్ 19 నివారణకు రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండ్లలో ప్రకటించే విధివిధానాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఇతర […]
లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, పలు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. ఇక రేపటి నుంచి దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానుండగా.. డొమెస్టిక్ ట్రావెల్స్ విషయంలో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- ప్రయాణీకుల అందరి దగ్గర ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా ఉండాలి.
- కోవిడ్ 19 నివారణకు రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండ్లలో ప్రకటించే విధివిధానాలను తప్పక పాటించాల్సి ఉంటుంది.
- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ప్రయాణం తర్వాత బస్టాండులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
- లక్షణాలు లేనివారు 14 రోజులు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండాలి.
- ఒకవేళ ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి.
- పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయితే కరోనా సెంటర్కు తరలించాలి.
- నెగటివ్ వస్తే ఇంటి వద్ద మరో 7 రోజులు ఐసోలేషన్లో ఉండాలి.
- బోర్డింగ్, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.
- బస్టాండులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లలలో ప్రయాణీకులు భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
- అన్ని చోట్లా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
ఇది చదవండి: తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల వివరాలు ఇవే..
Ministry of Health and Family Welfare issues guidelines for domestic travel. pic.twitter.com/LRg9XzEoaI
— ANI (@ANI) May 24, 2020