AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫార్మా కంపెనీలపై సీసీఎంబీ డైరక్టర్ ఘాటు వ్యాఖ్యలు

సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరికాదన్నారు సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రా. జర్నల్స్ పై ఫార్మాకంపెనీల ఒత్తిడిపై ట్విట్టర్లో ఘాటుగానే స్పందించిన ఆయన.. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి చేయడం సిగ్గుచేటు అన్నారు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ అధిపత్యం కోసం వారి పరిశోధన పత్రాలను ప్రచురించమని ఒత్తిడి చేయడం సరికాదన్నారు.

ఫార్మా కంపెనీలపై సీసీఎంబీ డైరక్టర్ ఘాటు వ్యాఖ్యలు
Balaraju Goud
|

Updated on: Aug 04, 2020 | 8:12 PM

Share

సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరికాదన్నారు సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రా. జర్నల్స్ పై ఫార్మాకంపెనీల ఒత్తిడిపై ట్విట్టర్లో ఘాటుగానే స్పందించిన ఆయన.. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి చేయడం సిగ్గుచేటు అన్నారు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ అధిపత్యం కోసం వారి పరిశోధన పత్రాలను ప్రచురించమని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. తాము చేస్తున్న పరిశోధనలను అంగీకరించమని జర్నల్స్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.

ప్రపంచాన్ని కుదుపేస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది. మందు లేని మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా 160కి పైగా ఫార్మా కంపెనీలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇదే క్రమంలో కొన్ని ఫార్మా కంపెనీలు తామ పరిశోధనలకు సంబంధించి వివరాలను జర్నల్ లో చేర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యం సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రా ఇలా ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ది లాన్సేంట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లు వివిధ కంపెనీల ఒత్తిడిని బయటపెట్టడం ఆందోళన కల్గిస్తోందన్నారు.