AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ రేసులో ఆ రెండు సంస్థలే ముందున్నాయి: డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ రేసులో ఆ రెండు సంస్థలే ముందున్నాయి: డబ్ల్యూహెచ్ఓ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 26, 2020 | 10:06 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, సామర్థ్యంలో రెండు ఫార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. అందులో ఆస్ట్రాజెనికా మొదటి స్థానంలో ఉండగా.. మోడర్నా కూడా పోటీ పడుతుందని చెప్పుకొచ్చారు.

కరోనా కోసం ప్రపంచవ్యాప్తంగా 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా.. 15 మాత్రమే క్లినిక్ ట్రయల్స్ దశలో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. సినోవాక్ సహా చైనాకు చెందిన పలు సంస్థలతో కరోనాకు సూది మందు అభివృద్ధి గురించి మాట్లాడిందని ఆమె పేర్కొన్నారు. కాగా కరోనాకు అడ్డుకట్టవేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మూడు వ్యాక్సిన్‌లకు అనుమతిని ఇచ్చింది. అందులో ఫాబిఫ్లూ, కోవిఫర్, సిప్రెమి ఉన్న విషయం తెలిసిందే.