AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలోని కరోనా బాధితుల్లో లక్షణాలు లేనివారే ఎక్కువ..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు.? ఎవరికి.? ఎలా సోకుతోందో అంతుచిక్కట్లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఐసీఎంఆర్ ఓ అధ్యయనం చేసింది. అందులో పలు నిజాలు బయటపడ్డాయి. జనవరి 22- ఏప్రిల్ 30 మధ్య కరోనా సోకిన 40,184 మందిలో దాదాపుగా 28.1 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని తేలింది. ఇక వీరి వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అటు కరోనా బాధితుల్లో ఎక్కువగా 50-60 ఏళ్ల […]

దేశంలోని కరోనా బాధితుల్లో లక్షణాలు లేనివారే ఎక్కువ..
Ravi Kiran
|

Updated on: May 31, 2020 | 6:54 PM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు.? ఎవరికి.? ఎలా సోకుతోందో అంతుచిక్కట్లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఐసీఎంఆర్ ఓ అధ్యయనం చేసింది. అందులో పలు నిజాలు బయటపడ్డాయి. జనవరి 22- ఏప్రిల్ 30 మధ్య కరోనా సోకిన 40,184 మందిలో దాదాపుగా 28.1 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని తేలింది. ఇక వీరి వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అటు కరోనా బాధితుల్లో ఎక్కువగా 50-60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 63.3 శాతం మంది ఉన్నారని.. అలాగే పదేళ్లలోపు చిన్నారులు 6.1 శాతం మంది ఉన్నారని ఐసీఎంఆర్ తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.