లాక్డౌన్ తర్వాత మొదలైన మొదటి తెలుగు సినిమా ఇదే..
లాక్డౌన్ అనంతరం సినిమా షూటింగులకు అనుమతి లభించడం వల్ల.. విలక్షణ దర్శకుడు రవిబాబు తన తదుపరి సినిమా 'క్రష్' చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్గా కౌగిలించుకునే సన్నివేశాన్ని వినూత్నంగా తెరకెక్కించారు. కాగా అందుకు సంబంధించిన వీడియోను...
లాక్డౌన్ అనంతరం సినిమా షూటింగులకు అనుమతి లభించడం వల్ల.. విలక్షణ దర్శకుడు రవిబాబు తన తదుపరి సినిమా ‘క్రష్’ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్గా కౌగిలించుకునే సన్నివేశాన్ని వినూత్నంగా తెరకెక్కించారు. కాగా అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.
ఎప్పుడూ వైవిధ్య కథలను ఎంచుకుంటారు నటుడు, డైరెక్టర్ దర్మకుడు రవిబాబు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘క్రష్’. లాక్డౌన్ తర్వాత షూటింగ్లకు అనుమతి రావడం వల్ల చిత్రీకరణ ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ప్రారంభమైన తొలి సినిమా షూట్ ఇదేనని ఈ సందర్భంగా రవిబాబు చెప్పాడు. ఈ క్రమంలోనే సెట్లో వీడియో విడుదల చేశారు. ఇందులో హీరో, హీరోయిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని తెరకెక్కించామని చెప్పారు.
‘హీరో ఈ వైపు నుంచి పరిగెత్తుకుని వస్తాడు. హీరోయిన్ మరో వైపు నుంచి పరిగెత్తుకుంటూ వస్తూంటాది. ఈ లోపు రవిబాబు వారిద్దరి మధ్య గాజు గ్లాస్ గోడను అడ్డంగా పెట్టాడు’. కాగా ఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్ రవి. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా ఉన్నారు.
After #lockdownindia first movie to start shooting is Director #RaviBabu ‘s #Crrush
And his first shot was a hug scene between hero and heroine.
Watch out for his mark!#StaySafe#IndiaFightsCoronavirus pic.twitter.com/u40VFLcA5u
— BARaju (@baraju_SuperHit) June 13, 2020
Read More:
అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి
భక్తులకు గుడ్న్యూస్.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్..