80th Independence Day Live Updates: చరిత్రలో తొలిసారి జాతీయ గేయం ఆలపించాం.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం!
80th Independence Day Live Updates Telugu: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

LIVE NEWS & UPDATES
-
ఏపీ శాసనమండలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ మోషేన్ రాజుదేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందియువతకు ఉపాధి కల్పించాలి-చైర్మన్ మోషేన్ రాజు -
ప్రజలకు చంద్రబాబు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేదేశం నాకు ఏం చేసిందని కాదు..దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి2047నాటికి వికసిత్ భారత్,స్వర్ణాంధ్ర సాకారం చేయాలివందేళ్ల స్వాతంత్య్ర వేడుకలనాటికి సమృద్ధి సాధించాలిదేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలి-చంద్రబాబు -
-
ప్రజలకు రేవంత్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలని సీఎం ఆకాంక్షసమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి-సీఎం రేవంత్సమానత్వంతోనే బలమైన ప్రజాస్వామ్య భారత నిర్మాణంభిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలి-సీఎం రేవంత్ -
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుశాసన మండలిలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ గుత్తా -
వేగంగా అభివృద్ధి చెందే దేశం భారత్- ప్రధాని మోదీ
- ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలి-ప్రధాని మోదీ
- 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని కల ఉంది
- భారత్ వైపు ప్రపంచం చూస్తోంది-ప్రధాని మోదీ
- 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు
- వేగంగా అభివృద్ధి చెందే దేశం భారత్-మోదీ
- 140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యం: మోదీ
-
-
PM Modi: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
- దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-మోదీ
- స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న మోదీ
- తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించాం
- దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది-మోదీ
- ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది
- ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోంది-మోదీ
- మనం పెద్ద పెద్ద కలలు కనాలి: మోదీ
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిజ. ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయజెండా ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మొత్తం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అయితే ఈ సారి దేశ చరిత్రలోనే తొలిసారి జాతీయ గీతం కంటే ముందుగా జాతీయ గేయమైన వందేమాతారాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామన్నారు మోదీ. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోందని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని.. మనం పెద్ద పెద్ద కలలు కనాలని ఆయన అన్నారు.
ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలని.. 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని కల ఉందన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని.. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందే దేశమని..140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ప్రధా మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని.. ఆత్మ నిర్భార్ భారత్గా ఎదగాలన్నారు ప్రధాని మోదీ. మెకిన్ ఇండియా, స్వదేశీ, ఓకల్ ఫర్ లోకల్ను దేశ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.
మోదీ ప్రసంగం ఇక్కడ చూడండి..
Published On - Aug 15,2026 7:53 AM




