AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో

Shaik Madar Saheb
|

Updated on: Aug 15, 2026 | 7:37 AM

Share

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించనున్నారు. స్వదేశీ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రధాని ప్రసంగం జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 5 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. . వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. యువ శక్తి ఫర్ వికసిత్ భారత్@2047 థీమ్ తో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం ఆలపించనున్నారు. ముందుగా స్వదేశీ గన్స్‌తో 21 గన్ సెల్యూట్ నిర్వహణ.. ఆ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ.. తర్వాత మోదీ ప్రసంగం ఉండనుంది. దేశవ్యాప్తంగా 5 వేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానించారు. ఆహ్వానితులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

Published on: Aug 15, 2026 07:10 AM
Follow Us