AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Updates: ఇంట్లో ‘భజన’..వారి కొంపముంచింది.. ఓ కుటుంబంలో 21 మందికి సోకిన కరోనా

ఏపీలో కరోనా కేసులు మళ్ళీపెరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది.

AP Corona Updates: ఇంట్లో 'భజన'..వారి కొంపముంచింది.. ఓ కుటుంబంలో 21 మందికి సోకిన కరోనా
Corona-Virus
Ram Naramaneni
|

Updated on: Mar 26, 2021 | 8:17 PM

Share

ఏపీలో కరోనా కేసులు మళ్ళీపెరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. తొండంగి మండలంలోని ఓ కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కరోనా ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఉమ్మడి కుటుంబాల్లో ఏకంగా 21 మందికి ఒకేసారి పాజిటివ్‌గా తేలటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తొండంగి గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నిర్వహించిన భజనలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. వీరిలో కొందరికి జ్వరం రావడంతో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.. దీంతో 21మందికి పాజిటివ్ తేలింది.

సుమారు 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 21 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులకు చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.. ఈ 21మందికి సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఊరంతా బ్లీచింగ్‌ చేయడంతోపాటు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ..కోవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

ఏపీలో ప్రమాదకరంగా పెరుగుతున్న కేసులు:

ఏపీలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువగా ఉంది. రోజు రోజుకు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ శుక్రవారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,96,863కి చేరింది. ఇందులో 4,145 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,85,515 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7203కు చేరుకుంది. ఇక గురువారం 306 మంది కరోనా నుంచి కోలుకుని  ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,46,16,201 సాంపిల్స్‌ను పరీక్షించారు.

Also Read: నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.6 కోట్ల లాటరీ టికెట్‌ అలా ఇచ్చేసింది.. మీరు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు

చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం

Follow Us
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని