AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSSPDCL: జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్‌.. ఎగ్జామ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.. ఎందుకంటే..

TSSPDCL: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత జులై 17వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. వెయ్యి పోస్టుల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించిన విషయం విధితమే...

TSSPDCL: జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్‌.. ఎగ్జామ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.. ఎందుకంటే..
Tsspdcl
Narender Vaitla
|

Updated on: Aug 25, 2022 | 5:02 PM

Share

TSSPDCL: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత జులై 17వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. వెయ్యి పోస్టుల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించిన విషయం విధితమే. అయితే ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఈ పరీక్షలో మాల్‌ ప్రాక్టిసింగ్ జరిగినట్లు తేలడమే. పరీక్షకు హాజరమైన 181 మంది అభ్యర్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అధికారులు పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఘట్‌కేసర్‌ పరీక్ష కేంద్రంలో మొబైల్‌ ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడడంతో మాల్‌ ప్రాక్టిస్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తనకు పరీక్షలో సమాధానాలు చెబుతామని డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఓ అభ్యర్థి అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు ఏడీఈల‌తో స‌హా ఐదుగురు ఉద్యోగుల‌ను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే రద్దు చేసిన పరీక్షకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్‌కు త్వరలోనే విడుదుల చేస్తామని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్రక‌టించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..