Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2023 Results: రేపే తెలంగాణ టెట్‌- 2023 ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్‌ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు..

TS TET 2023 Results: రేపే తెలంగాణ టెట్‌- 2023 ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి
TS TET 2023 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2023 | 8:45 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్‌ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చన్నారు.

కాగా టెట్‌ పరీక్ష పేపర్‌–1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక పేపర్‌ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్‌ ఫలితాల ప్రకటన అనంతరం అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసే వీలుంటుంది. ఈ కారణంగానే టెట్‌ ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) 2023 ఫలితాలు విడుదల

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సోమవారం (సెప్టెంబర్ 25) విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సీటెట్‌ 2023 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 29 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్‌ – 1కు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్‌ – 2కు 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 రాసిన వారు 1 నుంచి 5 తరగతులకు బోధించేందుకు అర్హత సాధిస్తారు. పేపర్ 2 రాసిన వారు 6 నుంచి 8 తరగతులకు బోధించేందుకు అర్హత సాధిస్తారు. కాగా సీటెట్‌లో అర్హత సాధించిన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..