AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్ణయం

నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమైంది. విశ్వవిద్యాలయాల్లో...

Telangana: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్ణయం
exams in telangana
Ganesh Mudavath
|

Updated on: May 22, 2022 | 7:56 AM

Share

నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమైంది. విశ్వవిద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌(Non – Teaching) పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌(KCR).. ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులకు సూచించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని ఉన్నతాధికారులు వివరించారు. ఉస్మానియాలో 2075, కాకతీయ 174, మహాత్మాగాంధీ 9, తెలంగాణ 9, శాతవాహన 58, పాలమూరు 14, పీఎస్టీయూ 84, బీఆర్‌ఏవోయూ 90, జేఎన్‌టీయూహెచ్‌ 115, ఆర్జీయూకేటీ 93, జేఎన్‌ఏఎఫ్‌యూ 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్‌ టెక్నికల్‌లో జూనియర్‌ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్‌ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్​ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్‌ల గడువు పెంపు లేదని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ  లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Assam floods: జల విలయంతో కకావికలం అవుతున్న అస్సాం.. నిరాశ్రయులైన లక్షలాది మంది..

Bigg Boss Winner Bindu Madhavi: బిగ్‏బాస్ విజేతగా నిలిచిన బిందుమాధవి.. టైటిల్ గెలిచిన తొలి అమ్మాయిగా హిస్టరీ..