AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Delhi Police Results 2023: ఎస్సెస్సీ కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) నియామక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింకుల ద్వారా ఎంపికైన వారి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి దశ పరీక్షలకు ఎంపికయినట్లు ఎస్సెస్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో..

SSC Delhi Police Results 2023: ఎస్సెస్సీ కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
SSC Delhi Police Results 2023
Srilakshmi C
|

Updated on: Jan 01, 2024 | 1:27 PM

Share

న్యూఢిల్లీ, జనవరి 1: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) నియామక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింకుల ద్వారా ఎంపికైన వారి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి దశ పరీక్షలకు ఎంపికయినట్లు ఎస్సెస్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ని దశల్లో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఢిల్లీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు లిస్ట్‌-1 కోసం క్లిక్‌ చేయండి. లిస్ట్‌-2 కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఉపకార దరఖాస్తు గడువు జనవరి 31 పెంపు

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు తేదీలోగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.

కాగా 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ గతేడాది (2023) ఆగస్టు 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ గడువు డిసెంబర్‌ 31తో ముగిసింది. అయితే గతేడాది కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ కోర్సుల ప్రవేశాలు ఆలస్యమవడంతో కొందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈపాస్‌ గణాంకాల ప్రకారం రెన్యువల్‌ విద్యార్థులు మొత్తం 8,04,304 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 5.08 లక్షల మంది మాత్రమే అర్జీలు సమర్పించినట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రవేశాలు పొందిన వారు దాదాపు 5 లక్షల మంది ఉంటే.. వారిలో 1.82 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..