AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCET 2025 Exam Notification: నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌.. 4 ఏళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలు

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

NCET 2025 Exam Notification: నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌.. 4 ఏళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలు
NTA NCET 2025 Notification
Srilakshmi C
|

Updated on: Feb 23, 2025 | 8:06 AM

Share

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభు, ప్రైవేట్‌ కళాశాలల్లో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) 2025 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు కల్పిస్తరాఉ. ఆయా సంస్థలు కౌన్సెలింగ్‌ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సుల్లో సీట్లను కేటాయిస్తాయి.

ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 16, 2025వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్థులు రూ.1200, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.650 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎన్‌సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 ఆర్‌ఐఈ, ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంస్థల్లో మొత్తం 6,100 సీట్లు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ ఉర్దూ వర్సిటీ 150 సీట్లు, వరంగల్‌ ఎన్‌ఐటీ లో 50 సీట్లు, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 50 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌.. తిరుపతిలోని నేషనల్‌ సంస్కృత యూనివర్సిటీలో (50 సీట్లు), శ్రీకాకుళం డా బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో 100 సీట్ల చొప్పున ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే…

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 16, 2025.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 18, 19 తేదీల్లో..
  • సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ వెల్లడి: ఏప్రిల్‌ మొదటి వారం
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీ: పరీక్షకు 3, 4 రోజుల ముందు నుంచి
  • నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్ష తేది: ఏప్రిల్ 29, 2025.

NTA NCET 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జమ్మూలోకి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. భీకర కాల్పులు!
జమ్మూలోకి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. భీకర కాల్పులు!
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో 'క్లోజ్డ్'బోర్డ్స్
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో 'క్లోజ్డ్'బోర్డ్స్
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన నిజాలు
భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన నిజాలు
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
ఆ డైరెక్టర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: హరీశ్ శంకర్
ఆ డైరెక్టర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: హరీశ్ శంకర్
పీఎం కిసాన్ మీకు రాలేదా..? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు..
పీఎం కిసాన్ మీకు రాలేదా..? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు..
ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి తిరుగులేదు!అప్పులు తీరి ఆదాయం డబుల్
ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి తిరుగులేదు!అప్పులు తీరి ఆదాయం డబుల్
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి..
ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి..