AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Exam Dates: మార్చిలో జరిగే ముఖ్యమైన పరీక్షల తేదీలివే.. ఏ పరీక్ష ఏయే తేదీల్లో జరుగుతుందంటే

దేశవ్యాప్తంగా మార్చి నెలంతా పలు పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్ధులు, యువత పలురకాల పరీక్షలతో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కాగా ఇటీవల కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, పలు విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షళకు అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు..

APPSC Exam Dates: మార్చిలో జరిగే ముఖ్యమైన పరీక్షల తేదీలివే.. ఏ పరీక్ష ఏయే తేదీల్లో జరుగుతుందంటే
Exam Dates In March 2024
Srilakshmi C
|

Updated on: Mar 02, 2024 | 6:38 AM

Share

దేశవ్యాప్తంగా మార్చి నెలంతా పలు పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్ధులు, యువత పలురకాల పరీక్షలతో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కాగా ఇటీవల కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, పలు విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షళకు అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు కూడా. ఈ క్రమంలో పలు ఉద్యోగ, ప్రవేశ పరీక్షల ప్రకటనలకు సంబంధించి పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి.

మార్చి నెలలో జరగనున్న ముఖ్యమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల తేదీల వివరాలు ఇవే..

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 సర్వీసు ప్రిలిమ్స్‌ పరీక్ష మార్చి 17, 2024వ తేదీన జరుగుతుంది.
  • ఏపీ డీఎస్సీ 2024 ఎగ్జామ్ మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది.
  • సీయూఈటీ పీజీ 2024 పరీక్ష మార్చి 11వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు జరుగుతుంది.
  • నీట్‌ ఎండీఎస్‌ 2024 ఎగ్జామ్‌ మార్చి 18వ తేదీ వరకు జరుగుతుంది.
  • ఎన్‌సీఎల్‌ అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ 2024 ఎగ్జామ్‌ మార్చి 4 వ తేదీ వరకు జరుగుతుంది.
  • టీఎస్‌ బీసీ గురుకుల బ్యాక్‌లాగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 మార్చి 3వ తేదీ వరకు జరుగుతుంది.

మార్చి 5న టీఎస్సీయస్సీ లైబ్రేరియన్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

తెలంగాణ సాంకేతిక, ఇంటర్‌ విద్య విభాగాల్లో లైబ్రేరియన్‌ పోస్టులకు మార్చి 5వ తేదీన ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం (మార్చి 1) తెలిపింది. మార్చి 5న ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరిశీలనకు వచ్చే జాబితాలో ఉన్న అభ్యర్ధులు అందరూ చెక్‌లిస్టులోని పత్రాలు తీసుకురావాలని సూచించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే తదుపరి సమయం ఇవ్వబోమని కమిషన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం పరిశీలనకు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైన అభ్యర్ధుల అభ్యర్థిత్వాన్ని నియామక ప్రక్రియలో పరిశీలించబోమని టీఎస్పీయస్సీ వెల్లడించింది. లైబ్రేరియన్‌ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.