AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 12th Board Exam: సీబీఎస్‌ఈ 12 బోర్డు పరీక్ష రద్ధుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

CBSE 12th Board Exam: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం..

CBSE 12th Board Exam: సీబీఎస్‌ఈ 12 బోర్డు పరీక్ష రద్ధుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు
CBSE 10th Result 2021
Subhash Goud
|

Updated on: May 18, 2021 | 8:16 PM

Share

CBSE 12th Board Exam: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినందుకు వ్యతిరేకంగా పీఐఎల్‌ (పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌) సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులకు అన్యాయమైన నిర్ణయమని కేరళకు చెందిన ఉపాధ్యాయుడు టోనీ జోసెఫ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్లాస్‌ 12 అనేది ఒక విద్యార్థి జీవితంలో ఒక భాగం, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ముఖ్యమైనదని ఆయన అన్నారు. కాగా, గత వారం ఈ పరీక్షలను రద్దు చేయాలని కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ ఉన్నత న్యాయస్థానంలో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఒక నిర్ధిష్ట కాలపరిమితిలో ఆబ్జెక్టివ్‌ మెథడాలజీ ద్వారా విద్యార్థులను అంచనా వేయాలని సూచించింది. అయితే పెద్ద మొత్తంలో విద్యావేత్తలు, సంస్థల అధిపతులు పరీక్షలు నిర్వహించడానికి అనుకూలంగా ఉన్నారని పిటిషనర్‌ జోసెఫ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి

NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? పరీక్షా తేదీలు మారుతాయా..? ఎలా దరఖాస్తు చేయాలి..?

LIC Agent: ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకుంటున్నారా..? అయితే దరఖాస్తు చేసుకోండిలా..! అర్హతలు ఏమిటి..?