AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు ఖరారు.. ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

ర‌ద్దు చేసిన ఏఈఈ నియామ‌క ప‌రీక్ష‌ల తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించింది. మే 8వ తేదీన ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ పోస్టుల‌కు, 9న అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు

TSPSC: రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు ఖరారు.. ఏఈఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ
TSPSC
Sanjay Kasula
|

Updated on: Mar 29, 2023 | 9:02 PM

Share

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక ప్రకటన చేసింది. పేపర్‌ లీకేజీ కారణంగా రద్దు చేసిన పరీక్షల తేదీలను ప్రకటించింది. ర‌ద్దు చేసిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షలను రద్దు చేసిందిటీఎస్‌పీఎస్‌సీ. తాజాగా నియామక పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో, సివిల్ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

ఇదిలావుంటే, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో మరిన్ని వివరాలు రాబడుతుంది. నిందితుడు ప్రవీణ్.. తన కోసమే గ్రూప్ -1 పేపర్ కొట్టేసినట్లు సిట్ విచారణలో తేలింది. తనకు పరిచయం ఉన్న ముగ్గురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ఇచ్చినట్లు విచారణలో చెప్పినట్లుతెలుస్తుంది. గ్రూప్ -1 పేపర్ కేవలం ఐదుగురికి మాత్రమే చేరినట్లు సిట్ ఆధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు 100మార్కులు సాధించిన వారిలో 84మందిని విచారించారు సిట్ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం