AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train: రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.? పెద్ద కథే ఉందిగా..

రైలులో జనరల్ కోచ్‌లు ఎప్పుడూ ముందు లేదా వెనుక ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక రద్దీ నియంత్రణ మాత్రమే కాదు, రైలు సమతుల్యత, సాంకేతిక భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి ఇక్కడ.

Train: రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.? పెద్ద కథే ఉందిగా..
Trains 5
Ravi Kiran
|

Updated on: Apr 22, 2026 | 8:50 PM

Share

మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు గమనిస్తే, జనరల్ బోగీలు ఎప్పుడూ రైలుకు అటు చివర లేదా ఇటు చివర ఇంజిన్ పక్కనే ఉంటాయి. రిజర్వేషన్ చేయించుకున్న స్లీపర్, ఏసీ కోచ్‌లు మాత్రం రైలు మధ్యలో ఉంటాయి. ఎప్పుడైనా ఎందుకు ఇలా అమర్చుతారని ఆలోచించారా? దీని వెనుక కేవలం ప్రయాణికుల సౌకర్యం మాత్రమే కాదు, చాలా లోతైన సాంకేతిక కారణాలు, భద్రతా అంశాలు కూడా దాగి ఉన్నాయి. జనరల్ బోగీల్లో ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీటిని రైలు మధ్యలో పెడితే, స్టేషన్ వచ్చినప్పుడు ప్రయాణికులందరూ మధ్యలోనే గుమిగూడతారు. దీనివల్ల ప్లాట్‌ఫారమ్‌పై రద్దీ పెరిగి, ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారు. బోగీలు చివర ఉండటం వల్ల రద్దీ ప్లాట్‌ఫారమ్ రెండు చివరలకు ఏర్పడటంతో, ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే ఎమర్జెన్సీ సమయంలో జనాన్ని ఖాళీ చేయడం కూడా సులభమవుతుంది.

రైలు వేగంగా వెళ్లేటప్పుడు లేదా మలుపులు తిరిగేటప్పుడు గాలి ఒత్తిడి, కుదుపులు ఎక్కువగా ఉంటాయి. జనరల్ కోచ్‌లలో పరిమితికి మించి ప్రయాణికులు ఉంటారు కాబట్టి, వాటిని మధ్యలో ఉంచితే రైలు బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఇంజిన్ అందించే విద్యుత్ సరఫరా లేదా బ్రేకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉండటానికి ఈ అమరిక దోహదపడుతుంది. స్లీపర్ కోచ్‌లను మధ్యలో ఉంచడం వల్ల అక్కడ ప్రయాణికులకు కుదుపులు తక్కువగా ఉండి ప్రయాణం సౌకర్యవంతంగా అనిపిస్తుంది. రైల్వే శాఖ ప్రతి నిర్ణయం వెనుక ఇలాంటి ఎన్నో లెక్కలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..

Follow Us
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్
మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్
శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?
శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్
ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే
ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే
అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!
అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!