రైలు ప్రయాణికులకు తీపి కబురు..ఇలా చేస్తే రైలు టిక్కెట్లపై డిస్కౌంట్..!

15 April, 2026

Subhash

రైళ్లలో ఎక్కువగా ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. ఇకపై రైలు టిక్కెట్లు డిస్కౌంట్‌కే లభించనున్నాయి. 

రైలు టిక్కెట్లు

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. రైల్వే శాఖలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంపొందించే లక్ష్యంతో తాజాగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది ఇండియన్ రైల్వేస్.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్

ఈ ఆఫర్ అన్ రిజర్వుడ్ టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా రైల్‌వన్‌ యాప్‌లో బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని గుర్తించుకోండి.

అన్ రిజర్వుడ్ టిక్కెట్లకు

రైలు ప్రయాణికులు రైల్‌వన్‌ యాప్‌లో డిజిటల్ పేమెంట్ మోడ్‌లో ట్రైన్‌ టిక్కెట్స్ బుక్ చేసుకున్నట్లయితే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

రైలు ప్రయాణికులు

యూపీఐ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెట్‌ బ్యాంకింగ్ ద్వారా రైల్‌వన్‌ యాప్‌ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకుని 3 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 

3 శాతం డిస్కౌంట్ 

నగదు రహిత సేవల్ని ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ పని చేసింది. ఇది ప్రతి రోజూ తక్కువ దూరాలకు రైళ్లలో ప్రయాణించేవారికి ఉపయోగపడుతుందని రైల్వే విభాగం తెలిపింది. 

 నగదు రహిత 

ఈ ఆఫర్ ఈ ఏడాది జూలై 14 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ పేమెంట్ విధానం ద్వారా తక్కువ ధరకే ప్రయాణికులు సులభంగా, తేలికగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 

 ఈ ఆఫర్ 

ఇది ఒక్క టిక్కెట్‌పై 3 శాతం డిస్కౌంట్‌లా కనిపించినప్పటికీ.. రోజూ ప్రయాణించే వారి కోసం కాబట్టి.. నెలవారీగా చూస్తే మంచి లాభమే ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.

టిక్కెట్‌పై 3 శాతం