AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: 10, 20, 50 రూపాయల నోట్లు ఎక్కడ? ఆర్బీఐ ముద్రణ నిలిపివేసిందా? ఎంపీ ఆరోపణలు నిజమేనా?

మార్కెట్‌లో రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్వరం పెంచారు. మార్కెట్‌లో అకస్మాత్తుగా తక్కువ విలువైన నోట్లు మాయమవడంపై ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో..

RBI: 10, 20, 50 రూపాయల నోట్లు ఎక్కడ? ఆర్బీఐ ముద్రణ నిలిపివేసిందా? ఎంపీ ఆరోపణలు నిజమేనా?
Subhash Goud
|

Updated on: Sep 22, 2024 | 6:26 PM

Share

మార్కెట్‌లో రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్వరం పెంచారు. మార్కెట్‌లో అకస్మాత్తుగా తక్కువ విలువైన నోట్లు మాయమవడంపై ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోట్ల ముద్రణను నిలిపివేశారని ఆరోపించారు. దేశంలో డిజిటల్ కరెన్సీ, యూపీఐ చెల్లింపుల వృద్ధి కోసం ఇలాంటివి జరగడం లేదా? అనే సందేహాన్ని లేవనెత్తాడు. ఆయన ఆరోపణ కొత్త వివాదానికి దారి తీసింది.

మార్కెట్లో ఎన్ని నోట్లు ఉన్నాయి?

2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా మార్చి, 2024 నాటికి 86.5 శాతం. మార్చి 31, 2024 నాటికి అత్యధికంగా 5.16 లక్షల రూపాయల 500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 10 రూపాయల నోట్లు 2.49 లక్షలు. గత కొన్ని రోజులుగా తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత ఏర్పడింది. దీనిపై దుమారం రేగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ.5,101 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ఏడాది క్రితం అంటే 2022-23లో నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ.4,682 కోట్లు ఖర్చు చేసింది.

ఇది కూడా చదవండి: Flipkart: ఫ్లిప్‌కార్ట్ నుండి అద్భుతమైన ఆఫర్.. రూ.75,999 ఫోన్‌ కేవలం రూ.32 వేలకే!

ఈ నోట్లను ముద్రించకపోవడానికి కారణం ఏమిటి?

మాణికం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. 10, 20, 50 రూపాయల నోట్ల కొరత కారణంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే నోట్ల కొరత ఏర్పడిందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Electricity Saving Tips: కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి ఇదో ఈజీ ట్రిక్.. అదేంటో తెలుసా?

యూపీఐ, నగదు రహిత లావాదేవీలను పెంచేందుకే ఇలా చేస్తున్నారని ఠాగూర్ ఆరోపించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఉద్దేశపూర్వకంగా తక్కువ విలువ కలిగిన నోట్లను ముద్రించడం లేదని ఠాగూర్ ఆరోపించారు. అయితే ఈ నిర్ణయం వల్ల పేదలు, మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?