Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ 2026.. బంగారం కొనుగోలుకు ముహూర్తం ఎప్పుడు? ఏయే సమయాల్లో!
Akshaya Tritiya 2026: భారతీయ హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ వేడుకలు జరగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సంపద వృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనాలని ఆశిస్తారు. అయితే అక్షయ తృతీయ ఏ రోజున వస్తుంది? బంగారం కొనాలంటే ఏయే సమయంలో కొంటే మంచిదో పూర్తి వివరాలు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకునే ఈ పండుగను ‘అఖా తీజ్’ అని కూడా పిలుస్తారు. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే జపం, దానం లేదా కొనుగోలు చేసే బంగారం శాశ్వతంగా వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.
అక్షయ తృతీయ 2026: ముఖ్యమైన తేదీ, సమయాలు:
- 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు వస్తోంది.
- తృతీయ తిథి ప్రారంభం: ఏప్రిల్ 19, 2026 – ఉదయం 10:49 గంటలకు.
- తృతీయ తిథి ముగింపు: ఏప్రిల్ 20, 2026 – ఉదయం 07:27 గంటలకు.
- అక్షయ తృతీయ పూజా ముహూర్తం: ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు (వ్యవధి: 1 గంట 45 నిమిషాలు).
బంగారం కొనుగోలుకు ఉత్తమ సమయం:
అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానమని భావిస్తారు. బంగారం కొనుగోలు సమయం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20 తెల్లవారుజామున 05:51 వరకు బంగారం కొనడానికి అత్యంత అనుకూలమైన సమయం.
ఇది కూడా చదవండి: Financial Alerts: ఒక్క పొరపాటుతో లక్షలు నష్టపోవచ్చు.. ఏప్రిల్ 5వ తేదీలోగా ఇది చేయండి!
అక్షయ తృతీయ విశిష్టత:
- ఈ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది:
- పరశురామ జయంతి: శ్రీమహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారని నమ్ముతారు. సత్యయుగం, త్రేతాయుగం ఈ పవిత్ర తిథి నాడే ప్రారంభమయ్యాయని చెబుతారు.
- బేరుడు శివుడిని ప్రసన్నం చేసుకుని, దేవతల ధనాగారానికి అధిపతిగా వరాన్ని పొందిన రోజు కూడా ఇదే. ఈ రోజున ఎటువంటి ప్రత్యేక ముహూర్తాలు చూడకుండానే వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఏంతంటే..
ఈ రోజున ఏం చేయాలి?
పూజ: ఉదయం పవిత్ర స్నానం ఆచరించి, మహాలక్ష్మి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం, వస్త్రదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ఇతర లోహపు వస్తువులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
గమనిక: ఈ సమాచారం ప్రజల విశ్వాసాలు, దృక్ పంచాంగ్ ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ పురోహితులను సంప్రదించగలరు.
Gold Price: వచ్చే ఏడాదిలో బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
