PMVBRY: ఉద్యోగంలో చేరితే రూ.15 వేలు! కేంద్రం కొత్త పథకం! ఎలా అప్లై చేసుకొవాలంటే..
కేంద్ర ప్రభుత్వం యువత కోసం కొత్త పథకాన్ని అమలు చేసింది. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా ఉద్యోగంలో చేరితే ప్రభుత్వం తరఫున రూ.15 వేలు అందిస్తారు. అలాగే ఉద్యోగం ఇచ్చే కంపెనీకి కూడా ఒక్కో ఉద్యోగికి ప్రతి నెలా రూ.3000 వరకు ప్రోత్సాహకం ఇస్తారు. ఈ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఉద్యోగావకాశాలను పెంచడం కోసమని కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PMVBRY) అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్ లో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరే ఉద్యోగులక ప్రభుత్వం రూ.15,000 వరకు అదనంగా చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి రూ.3,000 వరకు ప్రోత్సాహకం ఇస్తుంది. కంపెనీలకు రెండేళ్ల పాటు ఈ డబ్బులు అందిస్తారు. ఇక ఉద్యోగులకు ఈ మొత్తాన్ని రెండు విడతలుగా అందజేస్తారు. ఈ స్కీమ్ రూ.1 లక్ష లోపు జీతం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
ఎలిజిబిలిటీ ఇదే
- మొదటిసారి ఉద్యోగంలో చేరి ఉండాలి. మొదటిసారి EPFOలో రిజిస్టర్ అవ్వాలి.
- కంపెనీ EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి.
- ఉద్యోగి జీతం రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
- ఉద్యోగి కనీసం 6 నెలల పాటు ఒకే కంపెనీలో పనిచేయాలి.
అప్లికేషన్ ప్రాసెస్
కొత్తగా ఉద్యోగంలో చేరి EPFO ఖాతా తెరిచిన వెంటనే, ఉద్యోగి ఆటోమెటిక్ గా ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకానికి అర్హుడవుతాడు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయవలసిన అవసరంలేదు. ఉద్యోగి UAN నంబర్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా అతడి బ్యాంక్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేస్తుంది. ఒకవేళ అవ్వకపోతే సదరు ఎంప్లాయిమెంట్ కంపెనీని అడిగి EPFO వివరాలు తెలుసుకుని EPFO పోర్టలో రిక్వెస్ట్ పెట్టొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




