Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ భారత అక్షరాస్యత అభియాన్ గురించి మీకు తెలుసా..? దీనివల్ల ఎవరికి ప్రయోజనం తెలుసుకోండి..

Nav Bharat Saksharta Abhiyan: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు సంబంధించి అనేక పథకాలు, ప్రచారాలను నిర్వహిస్తాయి. మీరు సర్వశిక్షా

నవ భారత అక్షరాస్యత అభియాన్ గురించి మీకు తెలుసా..? దీనివల్ల ఎవరికి ప్రయోజనం తెలుసుకోండి..
Education To Adult
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 24, 2021 | 6:55 AM

Nav Bharat Saksharta Abhiyan: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు సంబంధించి అనేక పథకాలు, ప్రచారాలను నిర్వహిస్తాయి. మీరు సర్వశిక్షా అభియాన్ గురించి వినే ఉంటారు. అదేవిధంగా 1988 సంవత్సరంలో జాతీయ అక్షరాస్యత మిషన్ ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉంది. 1951లో దేశంలో 30 కోట్ల మంది నిరక్షరాస్యులుంటే 1981 నాటికి 44 కోట్లకు పెరిగింది. అటువంటి పరిస్థితిలో జాతీయ అక్షరాస్యత మిషన్ అనే భావన ఉనికిలోకి వచ్చింది. ప్రజలు నిరక్షరాస్యులుగా ఉండకూడదని కనీసం అక్షరాస్యులు కావాలన్నదే ఈ మిషన్ లక్ష్యం. అయితే ఇది 100% అక్షరాస్యతని సాధించలేకపోయింది. అయితే, ఈ రోజు మనం విద్యా రంగంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త మిషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ మిషన్ లక్ష్యం వంద శాతం అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించడం. ఈ మిషన్ పేరు- ‘నవ్ భారత్ లిటరసీ క్యాంపెయిన్’. దీని గురించి తెలుసుకుందాం.

ఈ ప్రచారాన్ని ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభించవచ్చు. నివేదికల ప్రకారం ‘నవ్ భారత్ అక్షరాస్యత ప్రచారం’ కోసం ‘కేబినెట్ నోట్’ ఖరారు చేయబడుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని పీటీఐ వర్గాలు తెలిపాయి. మూలాధారాలను విశ్వసిస్తే ప్రతిపాదన ప్రకారం ‘నవ్ భారత్ అక్షరాస్యత ప్రచారం’ (NILP) ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2027 వరకు అమలు చేస్తారు. నవ్ భారత్ సాక్షరతా అభియాన్ కింద దేశంలోని 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు కోట్ల మంది నిరక్షరాస్యులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కవర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన కార్యకలాపాలను పూర్తి చేస్తుంది.

వయోజన విద్యకు సంబంధించి ఇది కేంద్ర ప్రాయోజిత కొత్త పథకం. ఈ కార్యక్రమం కింద దేశంలోని 15 ఏళ్లు మరియు ఎక్కువ వయస్సు గల ఐదు కోట్ల మంది నిరక్షరాస్యులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమం ద్వారా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ కొత్త వయోజన విద్యా కార్యక్రమంలో ఐదు కోణాలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ముఖ్యమైన జీవిత నైపుణ్యాలకు సంబంధించిన జ్ఞానం, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ఉంటాయి. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలో వయోజన విద్యకు సంబంధించిన ఈ పథకం గురించి ప్రకటించారు.

Health Care Tips: శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా? లేని ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే..!

Swiggy Reveals 2021: ఈ సంవత్సరం మొదటి ఓటు బిర్యానికే.. తర్వాత సమోస, గులాబ్‌జామ్‌..

Childrens: పిల్లలు ఈ కూరగాయలను ఇష్టపడరు.. కానీ ఇందులోనే పోషకాలు అధికం..