AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు.. ఈ రూట్ ఫిక్స్..!

త్వరలోనే దేశ ప్రజలకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలలో గువహతి-హౌరా మధ్య తొలి రైలును మోదీ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు.. ఈ రూట్ ఫిక్స్..!
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Jan 02, 2026 | 6:38 PM

Share

తెలగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్. అతి త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు ఇక్కడ కూడా అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య నడిపేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే నుంచి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్-ఢిల్లీ మధ్య ప్రారంభిస్తే ప్రయాణికులకు సేవలు మరింత మెరుగుపర్చవచ్చని రైల్వేశాఖ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి వందే భారత్ ఈ రూట్లోనే

ఇప్పటికే రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెడితే మరింత వేగంగా ప్రయాణించవచ్చు. దీని వల్ల ప్రయాణ సమయం తగణీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉండగా.. ఇందులో 1700 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 22 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది. అయితే వందే భారత్ స్లీపర్ రైలు ఈ ప్రాంతాల మధ్య అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కనీసం 3 నుంచి 4 గంటలు తగ్గనుంది. అందేకాకుండా రాత్రుల్లో సౌకర్యవంతంగా సదూర ప్రయాణం చేయవచ్చు.

ఈ నెలలో ప్రారంభించనున్న మోదీ

హైదరాబాద్ నుంచి బిజినెస్, ఎడ్యుకేషన్, వ్యక్తిగత పనుల కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఢిల్లీ వెళ్తుంటారు. ఈ రూట్లలో నడిచే రైళ్లకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెడితే మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలంటే ఒకరోజు పడుతుంది. అదే వందే భారత్ స్లీపర్ వస్తే ప్రయాణం సమయం భారీగా తగ్గనుంది. జనవరిలో దేశంలోనే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అస్సాంలోని గువహతి నుంచి పశ్చిమబెంగాల్‌లోని హౌరా వరకు ఈ రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఇందులో ఛార్జీల వివరాలను కూడా విడుదల చేసింది. మరో 10 రోజుల్లో మోదీ దీనిని ప్రారంభించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. అక్కడ మరో ఫ్లైఓవర్
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. అక్కడ మరో ఫ్లైఓవర్
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. కెప్టెన్ స్వ్యాగ్ అదిరిపోయిందిగా!
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. కెప్టెన్ స్వ్యాగ్ అదిరిపోయిందిగా!