AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: బడ్జెట్‌కి ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారో తెలుసా? కేంద్ర బడ్జెట్‌ గురించి 5 ఇంట్రెస్టింగ్‌ విషయాలు!

భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికర ఘట్టాలున్నాయి. సాయంత్రం 5 గంటల ప్రెజెంటేషన్, హల్వా వేడుక, రహస్య బంకర్ ముద్రణ వంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అతి తక్కువ పదాల బడ్జెట్ నుండి సుదీర్ఘ ప్రసంగాల వరకు, ప్రధానమంత్రులు స్వయంగా సమర్పించిన అరుదైన సందర్భాలు ఉన్నాయి.

Budget 2026: బడ్జెట్‌కి ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారో తెలుసా? కేంద్ర బడ్జెట్‌ గురించి 5 ఇంట్రెస్టింగ్‌ విషయాలు!
Budget Halwa Ceremony
SN Pasha
|

Updated on: Jan 25, 2026 | 6:30 AM

Share

దేశ మొత్తం ఇప్పుడు రానున్న బడ్జెట్‌ గురించి ఎదురుచూస్తోంది. 2026-27 ఏడాదికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఈ సారి చాలా సానుకూల అంశాలు ఉంటాయని ట్యాక్స్‌ పేయర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బడ్జెట్‌కి ముందు హల్వా వేడుక అని ఒకటి ఉంటుంది. దీన్ని ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. అలాగే  బడ్జెట్‌ చరిత్రలో 5 ఇంట్రెస్టింగ్‌ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సాయంత్రం 5 గంటల బడ్జెట్‌

బ్రిటిష్ కాలంలో బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. ఎందుకంటే భారతదేశంలో సాయంత్రం 5 గంటలు అయితే, లండన్‌లో ఉదయం 11.30 గంటలు. ఈ సంప్రదాయం స్వాతంత్ర్యం తర్వాత కూడా 1999 వరకు కొనసాగింది. ఆ తర్వాత 2001 సంవత్సరంలో బిజెపి ప్రభుత్వం యశ్వంత్ సిన్హా సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చింది.

బడ్జెట్ బంకర్ సంప్రదాయం

1950కి ముందు బడ్జెట్‌ను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. అదే సంవత్సరంలో బడ్జెట్ లీక్ అయింది. అప్పటి నుండి నార్త్ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌లోని రహస్య బంకర్‌లో బడ్జెట్ ముద్రించబడింది. బడ్జెట్‌లో పాల్గొన్న దాదాపు 100 మంది ఇక్కడ 8 నుండి 10 రోజుల ముందుగానే లాక్ అవుతారు. వారికి మొబైల్, ఇంటర్నెట్ వంటికి అందుబాటులో ఉండవు. బడ్జెట్‌ను రహస్యంగా ఉంచడానికి ఇదే పద్దతిని ఇప్పటికీ పాటిస్తారు.

హల్వా వేడుక

బడ్జెట్ కు ముందు హల్వా తయారు చేస్తారు. తీపి వంటకంతో శుభ కార్యక్రమాన్ని ప్రారంభించే భారతీయ సంప్రదాయం ఇది. కరోనా కాలంలో మాత్రమే ఈ సంప్రదాయానికి అంతరాయం కలిగింది. ఈసారి బడ్జెట్ ముద్రణ ప్రారంభమయ్యే ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద కుండలో హల్వాను తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా దానిని వడ్డిస్తారు.

800 పదాల బడ్జెట్

ప్రస్తుత బడ్జెట్‌లు 400-500 పేజీలలో ఉంటోంది. కానీ ఒకప్పుడు ఈ బడ్జెట్ 800 పదాలతో మాత్రమే ఉండేది. 1977లో తాత్కాలిక ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ బడ్జెట్‌ను కేవలం 800 పదాలతో విడుదల చేశారు. వ్యయం (అంచనా వ్యయం) మాత్రమే చదివిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ 2 గంటల 42 నిమిషాల్లో అతి పొడవైన బడ్జెట్‌ను సమర్పించారు.

ప్రధానమంత్రి బడ్జెట్‌ను సమర్పించారు

భారతదేశ చరిత్రలో ఆర్థిక మంత్రికి బదులుగా ప్రధానమంత్రి బడ్జెట్‌ను సమర్పించిన సంఘటనలు మూడు ఉన్నాయి. మొదట 1958లో దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించారు. దీని తర్వాత 1970లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఇందిరా గాంధీ, తరువాత రాజీవ్ గాంధీ ప్రధానులుగా బడ్జెట్‌ను సమర్పించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి