Budget-2024: మధ్య తరగతికి గుడ్ న్యూస్ ఉంటుందా? కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు..

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్ డీఏ కూటమి విజయం సాధించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రభుత్వం జూలైలో కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈసారి కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు, ఇతర కేటాయింపులలో పెద్దగా మార్పులు ఉండబోవని భావిస్తున్నారు.

Budget-2024: మధ్య తరగతికి గుడ్ న్యూస్ ఉంటుందా? కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు..
Union Budget 2024
Follow us

|

Updated on: Jun 21, 2024 | 12:54 PM

కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను విధానంలో మినహాయింపు పరిమితి ఎంత వరకూ ఉంటుందన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనిపై వేతన జీవులందరూ చర్చించుకుంటున్నారు. మధ్య తరగతి, వేతన దారులు తమకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు.

జూలైలో బడ్జెట్..

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్ డీఏ కూటమి విజయం సాధించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రభుత్వం జూలైలో కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈసారి కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు, ఇతర కేటాయింపులలో పెద్దగా మార్పులు ఉండబోవని భావిస్తున్నారు. అత్యధిక పన్ను స్లాబ్‌కు సంబంధించిన థ్రెషోల్డ్‌ను రూ. 20 లక్షలకు పెంచాలనే అభ్యర్థనలు ఉన్నప్పటికీ, పాత పన్ను విధానంలో ఉన్న రేట్లను ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు.

మధ్య తరగతికి ఆనందమేనా..

మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడంతో పాటు దేశ జీడీపీ వృద్ధిని పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందుకోసం కొన్ని వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.

మార్పులు జరుగుతాయా..

కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్ ఉంది. ఆ పరిమితిని ఈ సారి బడ్జెట్ లో రూ.5 లక్షలకు పెంచనున్నటు అంచనా. ఇది కొత్త పన్ను విధానంలో రిటర్న్‌లను దాఖలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. తక్కువ సంపాదన ఉన్న వారికి మినహాయింపులు ఇస్తే వారికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి కూడా మెరుగవుతుంది. ఆ కొనుగోళ్ల తో వ్యాపార, పరిశ్రామిక వర్గాలకూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి దీనిపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

ప్రయోజనాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే దేశంలో చాలామంది వేతన జీవులకు ఊరట లభిస్తుంది. రూ. 7.6 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి రూ. 10,400 ( 4 శాతం ఆరోగ్యం & విద్య సెస్‌తో సహా) తగ్గింపు లభిస్తుంది. రూ. 50 లక్షలకు పైబడి రూ. ఒక కోటి వరకూ ఆదాయం ఉన్నవారికి రూ.11,440 (సెస్ , 10 శాతం సర్‌ఛార్జ్‌తో సహా) ప్రయోజనం కలుగుతుంది. అలాగే రూ. ఒక రూ.కోటికి పైబడి రూ.2 కోట్లు వరకూ సంపాదించే వారికి రూ. 11,960 (సెస్, 15 శాతం సర్‌ఛార్జ్‌తో సహా) తక్కువగా ఉంటుంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ. 13 వేల (సెస్, 25 శాతం సర్‌ఛార్జ్‌తో సహా) తగ్గింపు లభిస్తుంది.

అంచనాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న పన్ను విధానంపై మార్కెట్ నిపుణులు ఆర్థిక వేత్తలు పలు రకరాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రకారం..

  • కొత్త పన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచితే.. అది ప్రభుత్వం తీసుకున్న మంచి చర్య అవుతుంది.
  • కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పెద్ద పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
  • పాత పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు కొన్ని సెక్షన్ల కింద పెట్టుబడులపై తగ్గింపులతో పాటు ఇంటి అద్దె భత్యం, సెలవు ప్రయాణ భత్యం వంటి మినహాయింపులను పొందే అవకాశం ఉంటుంది.
  • కొత్త పన్ను విధానంలో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలనే పరిశ్రమ ప్రతినిధుల అభ్యర్థనను కేంద్రం పరిశీలించే అవకాశం లేదు.
  • 30 శాతం అత్యధిక ఆదాయపు పన్నుకు సంబంధించిన మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని అభ్యర్థనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ పాత పన్ను విధానంలో ఉన్న రేట్లను ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు.
  • వృథాగా పోతున్న సబ్సిడీలు, ఇతర పథకాలపై వ్యయాన్ని పెంచడానికి బదులుగా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళికి రికార్డ్‌ సృష్టించనుందా?
భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళికి రికార్డ్‌ సృష్టించనుందా?
నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? నిపుణుల సలహా ఏమిటంటే
నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? నిపుణుల సలహా ఏమిటంటే
మొన్నటివరకు హోమ్లీ హీరోయిన్.. ఇప్పుడేమో హాట్.. గుర్తు పట్టారా?
మొన్నటివరకు హోమ్లీ హీరోయిన్.. ఇప్పుడేమో హాట్.. గుర్తు పట్టారా?
హైవేపై బస్సు బోల్తా.. నలుగురు యాత్రికుల దుర్మరణం
హైవేపై బస్సు బోల్తా.. నలుగురు యాత్రికుల దుర్మరణం
అందాలతో పిచ్చెక్కించే ఈ అందాల భామ ఎవరో తెల్సా
అందాలతో పిచ్చెక్కించే ఈ అందాల భామ ఎవరో తెల్సా
జమ్ములో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఫినిషింగ్ టచ్!
జమ్ములో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఫినిషింగ్ టచ్!
రాహు, కేతు దోషమా..! 18 శనివారాలు ఈ పరిహాలు చేసి చూడండి..
రాహు, కేతు దోషమా..! 18 శనివారాలు ఈ పరిహాలు చేసి చూడండి..
దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి.. ఏపీ సర్కార్‌కు బొత్స సవాల్
దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి.. ఏపీ సర్కార్‌కు బొత్స సవాల్
పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
పెట్టుబడిదారులకు అలెర్ట్.. అక్టోబర్ నుంచి కీలక నియమాల మార్పు
పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు