AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఈ ఆదాయాలపై మీరు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అవి ఏంటో తెలుసా..?

Income Tax: ఆదాయపు పన్ను ఉద్యోగిపై మాత్రమే కాకుండా అనేక ఇతర వనరుల ద్వారా సంపాదించిన ఆదాయంపై కూడా చెల్లించాలి. ఇందులో వడ్డీ ఆదాయం, సైడ్‌ బిజినెస్‌,..

Income Tax: ఈ ఆదాయాలపై మీరు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అవి ఏంటో తెలుసా..?
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 09, 2021 | 6:20 AM

Share

Income Tax: ఆదాయపు పన్ను ఉద్యోగిపై మాత్రమే కాకుండా అనేక ఇతర వనరుల ద్వారా సంపాదించిన ఆదాయంపై కూడా చెల్లించాలి. ఇందులో వడ్డీ ఆదాయం, సైడ్‌ బిజినెస్‌, పెట్టుబడి మొదలైన ఆదాయాలు ఉంటాయి. భారతదేశ ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే ప్రజలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితేమీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేని కొన్ని వనరులు కూడా ఉన్నాయి. అవేంటంటే.. రైతులు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ ఆదాయానికి పన్ను చట్టం ప్రకారం మినహాయింపు ఉంటుంది. అలాగే మీరు ఒక సంస్థలో భాగస్వామి అయితే, దాని లాభాలలో మీకు వాటా లభిస్తే దానిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. భాగస్వామ్యంలో సంపాదించిన లాభాలపై కూడా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్‌ 56(2) ప్రకారం.. అనేక రకాల ఆదాయాలపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే మీరు వివాహం విషయంలో 50 వేలు లేదా అంతకంటే తక్కువ పొందుతున్నట్లయితే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. బంధువు, వారసత్వం లేదా సంకల్పం నుంచి పొందిన ఆదాయంపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇవే కాకుండా పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కమిటీ మరియు జిల్లా కంటోన్మెంట్‌ బోర్డు లేదా ఏదైనా ఫౌండేషన్‌, యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థలు, సంస్థ మొదలైన వాటి నుంచి పొందిన ఆదాయాలు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని 12ఏ మరియు 12 ఏఏ సెక్షన్ల కింద నమోదు చేయబడిన స్వచ్చంద లేదా మత ట్రస్ట్‌ నుంచి పొందిన వాటికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.

ఒక ఉద్యోగి ఒక సంస్థలో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసినట్లయితే .. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు పొందిన గ్రాట్యూటీ మొత్తం పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యూటీపై మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రైవేటు రంగ ఉద్యోగులకు రూ.10 లక్షల వరకు గ్రాట్యూటీపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది కాకుండా ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి ఉపసంహరించబడిన డబ్బు కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అయితే ఈ పన్ను మినహాయింపు ఐదు సంవత్సరాలకుపైగా పని చేసిన తర్వాత మాత్రమే లభిస్తుంది.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడం కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం, వడ్డీ మరియు దాని మెచ్యూరిటీ వ్యవధిలో అందుకున్న మొత్తంపై పన్ను లేదు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యయనం లేదా పరిశోధన కోసం ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల నుంచి పొందిన స్కాలర్‌షిప్‌లు, కళాశాల లేదా విదేశాలలో చదువుతున్నప్పుడు పొందిన స్కాలర్‌షిప్‌లు కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తాయి. ఒక వ్యక్తి తల్లిదండ్రుల నుంచి, కుటుంబ వారసత్వంలో అభరణాలు, నగదు పొందినప్పటికీ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఒక విషయం గుర్తించుకోవాలి. ఇలాంటి లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అందుకే పన్ను చెల్లింపుల విషయంలో అవగాహన కలిగి ఉంటే మంచిది.

ఇవి కూడా చదవండి:

Rs 2000 Notes: క్రమంగా తగ్గిపోతున్న 2000 రూపాయల నోట్ల చలామణి.. నిలిచిపోయిన ముద్రణ.. నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ

Insurance Policy: మీరు బీమా పాలసీ తీసుకుంటున్నారా..? వాటి గురించి ముందుగానే చెప్పేయండి..లేకపోతే ఇబ్బందే..!