Indian Railways: సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. కాజీపేట, విజయవాడ నుండి ప్రత్యేక రైళ్లు.. ఏయే ప్రాంతాలకు అంటే..
Indian Railways: సమ్మర్ సీజన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రైన్స్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మరి ఏయే ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ను నడుపుతోందో తెలుసుకుందాం..

Indian Railways: వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు కాజీపేట – నిజాముద్దీన్, విజయవాడ – ఫరీదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
1. కాజీపేట – నిజాముద్దీన్ – కాజీపేట (07662/07663):
రైలు నెం. 07662: కాజీపేటలో శుక్రవారం (మే 22, 2026) మధ్యాహ్నం 13:10 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 23:40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. రైలు నెం. 07663: నిజాముద్దీన్లో సోమవారం (మే 25, 2026) తెల్లవారుజామున 03:40 గంటలకు బయలుదేరి, మంగళవారం ఉదయం 11:00 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. ఆగే స్టేషన్లు: బల్హర్షా, చంద్రపూర్, సేవగ్రామ్, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి
2. విజయవాడ – ఫరీదాబాద్ – విజయవాడ (07664/07665):
రైలు నెం. 07664: విజయవాడలో శుక్రవారం (మే 22, 2026) ఉదయం 05:10 గంటలకు బయలుదేరి, శనివారం మధ్యాహ్నం 14:50 గంటలకు ఫరీదాబాద్ చేరుకుంటుంది. రైలు నెం. 07665: ఫరీదాబాద్లో సోమవారం (మే 25, 2026) అర్ధరాత్రి దాటాక 01:10 గంటలకు బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 13:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు: డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, బల్హర్షా, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
కోచ్ల వివరాలు:
ఈ ప్రత్యేక రైళ్లన్నీ స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను కలిగి ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
ఇది కూడా చదవండి: PM Modi: పెట్రోల్, డీజిల్ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




