AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రైల్వే స్టేషన్‌ కూడా లేని రాష్ట్రం మన దేశంలో ఉందని తెలుసా? అయినా కూడా టూరిస్ట్‌ హబ్‌ కొనసాగుతోంది..

సిక్కిం భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం. హిమాలయ భౌగోళిక సవాళ్లు రైలు మార్గాల నిర్మాణాన్ని కష్టతరం చేశాయి. ప్రస్తుతం ప్రయాణికులు సిలిగురి లేదా జల్పైగురిని ఉపయోగిస్తున్నారు. రోడ్డు, విమాన కనెక్టివిటీ బాగా ఉంది. అయితే, సిక్కింను దేశీయ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి సివోక్-రాంగ్పో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఒక్క రైల్వే స్టేషన్‌ కూడా లేని రాష్ట్రం మన దేశంలో ఉందని తెలుసా? అయినా కూడా టూరిస్ట్‌ హబ్‌ కొనసాగుతోంది..
Railway Station
SN Pasha
|

Updated on: Dec 30, 2025 | 3:51 PM

Share

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది ఇండియా. చాలా వేగంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌ కూడా మనకే ఉంది. ఇండియన్‌ రైల్వేస్‌ ఎంత పెద్ద రవాణా వ్యవస్థనో అందరికీ తెలిసిందే. అలాంటి మన దేశంలో ఓ రాష్ట్రంలో అసలు ఒక్కటంటే ఒక్క రైల్వే స్టేషన్‌ కూడా లేదు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం.

రైలులో సిక్కిం వెళ్లే ప్రయాణికులు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి లేదా జల్పైగురిలో దిగాలి. రాష్ట్ర హిమాలయ భౌగోళిక స్థితి, నిటారుగా ఉన్న పర్వతాలు, లోతైన లోయలు, ఇరుకైన కనుమలు రైల్వే నిర్మాణాన్ని కష్టతరం చేశాయి. అందుకే ఇక్కడ రైల్వే లైన్ల నిర్మాణం జరగలేదు.

సిక్కిం చాలా కాలంగా రోడ్డు రవాణాపై ఎక్కువగా ఆధారపడింది, దీనివల్ల రైల్వే నెట్‌వర్క్ ఆవశ్యకత తగ్గింది. బాగా అభివృద్ధి చెందిన రోడ్లు, విమాన కనెక్టివిటీ, కేబుల్ కార్లు, సౌకర్యవంతమైన స్థానిక రవాణా చాలా ప్రయాణ అవసరాలను తీర్చాయి. అయితే సిక్కింను జాతీయ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి సివోక్–రాంగ్పో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us